Chiranjeevi-Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎన్నో ఏళ్లుగా పోటీ కొనసాగుతూనే ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం ఎంతో టెన్షన్గా ఉండేది. ఒక వేళ మెగాస్టార్ చిరంజీవి సినిమా హిట్ కొట్టారంటే.. బాలయ్య మరోసారి సినిమా ఖచ్ఛితంగా హిట్ కొట్టేలనే కసితో ఉండేవారు. ఆ రేంజ్లో వీరి మధ్య పోటీ ఉండేది. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడంతో ఆ పోటీ కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ మళ్లీ చిరంజీవి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. ఖైదీ నంబర్ 150(చిరంజీవి), గౌతమి పుత్ర శాతకర్ణి (బాలయ్య) నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో తలపడ్డాయి. అయితే ఈ రెండు కమర్షియల్ హిట్ అందుకున్నాయి.
తాజాగా మళ్లీ ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ నటిస్తోన్న ‘వీర సింహా రెడ్డి’పైనే అందరి చూపు ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రెండు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. దీంతో రెండు సినిమాల చిత్ర యూనిట్ షూటింగ్లో వేగం పెంచాయి. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోల సినిమాలకు సంబంధించిన ఓ ప్రాజెక్ట్ విషయం ఫిల్మ్ సర్కిల్లో తెగ హల్చల్ చేస్తోంది. తాజాగా బాలయ్య ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఛలో సినిమా ఫేం వెంకీ కుడుముల డైరెక్షన్లో బాలయ్య మరో సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన స్టోరీని బాలయ్యకు కూడా చెప్పినట్లు సమాచారం.
సినిమా స్టోరీ నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే వెంకీ కుడుముల తన మూడో సినిమాను చిరంజీవికి కూడా చెప్పారట. కానీ చిరంజీవికి ఫైనల్లో స్టోరీ నచ్చకపోవడంతో స్టోరీ క్యాన్సెల్ చేసినట్లు సమాచారం. కానీ ఈ విషయంలో బాలయ్య ఇన్వాల్ అయి.. చిరంజీవిని ఒప్పించినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.