Chhattisgarh: రూ.2 వేల నోటు ఆ దొంగలను పట్టించిందా.. అసలేం జరిగిందంటే?

Chhattisgarh: తాజాగా 2000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. డబ్బు ఉన్న వారు ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలా అని తిప్పలు పడుతుండగా మరొకవైపు మోసం చేసే వారి సంఖ్య అంతకు అంతకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నోట్లను మార్చుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్ట్ కమాండర్ మల్లేష్కు చెందిన రూ. 2 వేల నోట్లను మార్చుతూ ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు చిక్కారు.

రూ. 8 లక్షల విలువ గల రూ. 2 వేల నోట్లను మారుస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రూ. 2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోగా రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని సూచించింది. మే 18 నుంచి బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్ల మార్పిడికి అనుమతిచ్చింది. దీంతో ఛత్తీస్ గడ్ రాష్ట్రం బసగూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర మద్వి, లక్ష్మణ్ కుంజమ్‌లు. మావోయిస్టు కమాండర్కు చెందిన రూ. 2 వేల నోట్లను మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

 

రూ.8 లక్షల విలువ గల రూ. 2000 కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుతుండగా బీజాపూర్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బసగూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర మద్వి, లక్ష్మణ్ కుంజమ్‌ మావోయిస్ట్ కమాండర్ మల్లేష్ కు చెందిన రూ. 8 లక్షల విలువ గల రూ. 2 వేల నోట్లను మార్చేందుకు మహాదేవ ఘాట్ కు వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు పోలీసుల చెక్‌ పాయింట్‌ను గుర్తించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరు మావోయిస్ట్ కమాండర్ కు రూ. 2 వేల నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

 

మావోయిస్టు సానుభూతి పరుల నుంచి నుంచి రూ. 2000 నోట్ల మూడు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కటి మొత్తం రూ. 2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన 11 పాస్‌బుక్‌లు, నక్సలైట్ల కరపత్రాలు స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్ష్నే తెలిపారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నక్సలైట్ కమాండర్ మల్లేష్ తమకు రూ.8 లక్షల రూ. 2000 నోట్లు ఇచ్చాడని గజేంద్ర మద్వి తెలిపాడు. ఇందులో రూ. 50 వేలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మరో రూ. 48 వేలను యూనియన్ బ్యాంక్‌లో జమ చేశామని అన్నారు. మరో 50 వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకులో రూ. 50 వేల చొప్పున జమ చేశామని వెల్లడించాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -