Nagarjuna: తట్టుకోలేననే కారణం వల్లే నాగ్ అక్కడికి వెళ్లలేదా?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ వ్యక్తిగతంగా కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఎన్నో వందల సినిమాలకు పైగా నటించి ఇండస్ట్రీలో మర్చిపోలేని గుర్తింపు అందుకున్నారు.

 

అయితే ఈయన కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో ఇటీవలే అనగా నవంబర్ 17న కన్నుమూశారు. ఇక ఈ మరణ వార్త విన్న ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్ర ప్రజలు ఆయన చివరి చూపును చూసుకోవడానికి తరలివచ్చారు.

 

చాలావరకు సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అందరూ పాల్గొన్నారు. కానీ ఒక నాగర్జున మాత్రం అక్కడికి వచ్చినట్లు కనిపివ్వలేదు. దీంతో ఆయన రాకపోవడంతో అందరిలో అనుమానాలు పెరిగాయి. ఎందుకంటే నాగార్జునకు కృష్ణ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అయినా కూడా కృష్ణ చూపుకు రాకపోవడంతో కారణం ఏంటి అని ఆరా తీశారు.

 

దీంతో ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్టు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నాగార్జున రాకపోవడానికి కారణాన్ని తెలిపాడు. సాధారణంగా దగ్గర వారిని కోల్పోయినప్పుడు ఆ బాధను తట్టుకోలేరు అంటూ.. అందుకే నాగార్జున తట్టుకోలేకనే కృష్ణ చివరి చూపును కూడా చూడలేకపోయాడు అంటూ.. గతంలో ఈవీవీ, దాసరి వంటి ప్రముఖులు కనుమూసినప్పుడు కూడా నాగార్జున వెళ్లలేదని అన్నారు. కానీ అంత్యక్రియలు
అయిపోయిన తర్వాత వెళ్లి కుటుంబాన్ని పరామర్శిస్తారు అని తెలిపాడు. దీంతో నాగార్జున తట్టుకోలేకనే అంత్యక్రియలకు వెళ్లలేదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -