Victory Venkatesh: టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవారిలో విక్టరీ వెంకటేశ్ ముందుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఆయనకు ఎక్కువగా ఉంది. ఎలాంటి సెంటిమెంట్ సినిమాతో అయినా వెంకటేష్ అలరింపజేస్తాడు. అయితే గతంలో వెంకటేస్ ఓ హీరోయిన్ కాళ్లు కూడా పట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పట్లో అది పెద్ద వార్తగా మారి సంచలనం రేకెత్తించింది.
ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే విక్టరీ వెంకటేష్ 1966లో సౌందర్యతో కలిసి ఓ సినిమా చేశాడు. అదే పవిత్ర బంధం సినిమా. ఆ సినిమా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో హీరో వెంకటేశ్, హీరోయిన్ సౌందర్య జంటకు ఏ సినిమా చేసినా విపరీతంగా ఆడేది. ఆ జోడికి అప్పట్లో భారీ క్రేజ్ ఉండేది. వారి కాంబోలో వచ్చిన దాదాపు అన్ని మూవీలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు.
అయితే పవిత్ర బంధం మూవీ టైంలో సౌందర్య కాళ్లు వెంకటేశ్ మొక్కాడనే టాక్ బాగా వినిపిస్తోంది. అసలు ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే ఆ సినిమాలో వెంకటేశ్, సౌందర్య ఫస్ట్ నైట్ సీన్ ఉంది. అందులో సౌందర్య వచ్చి వెంకటేశ్ కాళ్లు మొక్కగా అదేంటి నా కాళ్లు మొక్కుతున్నావ్ అని వెంకటేశ్ అడిగే డైలాగ్ ఉంటుంది.
ఆ తర్వాత సౌందర్య డైలాగ్ చెబుతూ పతియే ప్రత్యక్ష దైవం కదండీ అంటుంది. దాంతో వెంకటేశ్ కూడా సౌందర్య కాళ్లు మొక్కడం జరుగుతుంది. ఆ తర్వాత సౌందర్య వెనక్కు జరిగి ఏంటండి ఇది అని అనగా అప్పుడు వెంకటేశ్ మాట్లాడుతూ నువ్వు నా కాళ్లు మొక్కగా లేనిది నేను నీ కాళ్లు మొక్కితే వచ్చిందా అంటాడు. అయినా భార్య, భర్తలు ఏమైనా దేవుళ్లా అంటూ క్లాస్ పీకే సీన్ ఉంది. అది మహిళల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి సీన్లు చేస్తాడు కాబట్టే వెంకటేశ్కు మహిళల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నెటిజన్లు అంటున్నారు.