Dil Raju: సమంత పరువు తీసిన దిల్ రాజు.. అసలేం జరిగిందంటే?

Dil Raju: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలకపాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. గుణశేఖర్ కూతురు నీలిమ ఈ సినిమాని నిర్మించగా ఆ తర్వాత దిల్ రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనటానికి సమంత, దిల్ రాజు ముఖ్యపాత్ర పోషించారు. దీంతో ఈ సినిమా డిజాస్టర్ కూడా వారి ఖాతాలోకి వచ్చి చేరింది.

శాకుంతలం సినిమా ప్రమోషన్ల సమయంలో దిల్ రాజు, సమంత సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక సమంత తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ కొంతవరకు ఎమోషనల్ గా కూడా వర్కౌట్ చేయాలని ప్రయత్నించింది. అయితే కథ , స్క్రీన్ ప్లే లో పట్టు లేకపోవటంతో ఈ సినిమా మొదటి షోకే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమా డిజాస్టర్ గురించి సమంత స్పందిస్తూ.. కర్మ ఫలం అనుభవించక తప్పదు అంటూ భగవద్గీతలోనే ఒక లైన్ షేర్ చేసింది.

 

ఇక తాజాగా శాకుంతలం సినిమా డిజాస్టర్ గురించి దిల్ రాజు కూడా స్పందించాడు. పాన్ ఇండియా సినిమాలు నిర్మించాలన్న ఆశతోనే తాను శాకుంతలం సినిమాలో భాగమైనట్లు ఇదివరకే దిల్ రాజు ఓపెన్ గా వెల్లడించాడు. ప్రమోషన్ల సమయంలో తన మాటలతో కొంతవరకు సినిమా మీద హైప్ క్రియేట్ చేసిన కూడా సినిమాలో సరదా లేకపోవడంతో ప్రేక్షకులు దానిని రిజెక్ట్ చేశారు. దీంతో దిల్ రాజు శాకుంతలం సినిమా వల్ల భారీగా నష్టపోయాడు.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు శాకుంతలం సినిమా డిజాస్టర్ గురించి స్పందిస్తూ..” నిర్మాతగా తన 25 ఏళ్ల సినీ కెరీర్ లో శాకుంతలం తనకి పెద్ద జర్క్ ఇచ్చింది అంటూ దిల్ రాజు తెలిపాడు. సినిమా విడుదలకు ముందు అంతా ఇంతా అని మాట్లాడిన దిల్ రాదు ఇప్పుడు సినిమా డిజాస్టర్ కావడంతో ఇలా మాట్లాడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -