Puri-Chiru: ఆ కథను పక్కన పెట్టిన పూరీ.. చిరంజీవి కోసం అలాంటి స్టోరీ అంటూ?

Puri-Chiru: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఈయన రీఎంట్రీ తర్వాత నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా పూరి జగన్నాథ్ ఈ సినిమాలో నటించడంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ తో కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి మధ్య ఎన్నో విషయాలు చర్చలకు వచ్చాయి. ఆచార్య సినిమా డిజాస్టర్ గురించి మెగాస్టార్ చెప్పగా లైగర్ సినిమా డిజాస్టర్ గురించి పూరి జగన్నాథ్ ప్రస్తావించారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాలని భావించారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఆటో జానీ సినిమా కథను కూడా సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి సూచించారు. పూరి జగన్నాథ్ ఈ సినిమా కథలో మార్పులు చేయడమేమో కానీ ఈ కథను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆటో జానీ సినిమా గురించి చర్చకు తీసుకోవచ్చారు.ఆటో జానీ కథ ఉందా పక్కన పెట్టేసావా అంటూ పూరి జగన్నాథ్ ను ప్రశ్నించగా ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెబుతూ ఎప్పుడో పక్కన పెట్టేసాను అన్నయ్య మీ కోసం మరొక మంచి కథను సిద్ధం చేసి తీసుకు వస్తాను అంటూ పూరి జగన్నాథ్ సమాధానం చెప్పారు. ఈ విధంగా పూరి జగన్నాథ్, చిరంజీవి మధ్య ఆటో జానీ సినిమా గురించి మరోసారి ప్రస్తావన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు కోసం పూరి ఎలాంటి కథ సిద్ధం చేస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -