Money: చేతి నిండా డబ్బు ఉండాలంటే ఉదయం లేవగానే ఇలా చేయండి!

Money: హిందూ సంప్రదాయంలో ఉదయం సాయంత్రానికి ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా సూర్యుడు ఉదయించే ముందు అస్తమించే సమయం లో ప్రత్యేక పూజలను చేస్తుంటారు. ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయని కొన్ని శాస్త్రలు వెల్లడిస్తున్నాయి.

మన గ్రంథాలలో సూచించిన విధంగా ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూడటం ఎంతో మంచిది. అరచేతులలో లక్ష్మి దేవితో పాటు సరస్వతి విష్ణుమూర్తి కూడా ఉంటారని భావిస్తారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూడటం శుభప్రదంగా భావిస్తారు. ఇలా అరచేతిని చూసిన వెంటనే అరచేతులతో కళ్లను నమస్కరించాలి. నిద్రలేచిన వెంటనే మనం మంచం దిగిన వెంటనే భూదేవిని నమస్కరించుకొని మన పనులు ప్రారంభించాలి. భూదేవి మన భారాన్ని మొత్తం మోస్తుంది కాబట్టి భూదేవికి నమస్కరించడం తెలుగు సంప్రదాయం.

ప్రతి రోజు కాల కృత్యాలు ముగిసిన వెంటనే స్నానం చేసి సూర్య భగవానుడికి రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. పూజ చేసే సమయంలో కనకదారా, లక్ష్మి మూలాలను ప్రతిరోజు జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. జీవితంలో ఎల్లప్పుడూ సంపద శ్రేయస్సు కూడా ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయం ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం మనపై ఉంటుందని శాస్త్రలు, పండితులు చెబుతుంటారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -