Tarak: యాడ్ కోసం తారక్‌కు కళ్లు చెదిరే మొత్తం.. ఎంత ఇచ్చారంటే?

Tarak: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమాలతోపాటు పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే స్టార్ హీరోలు సినిమాలతోపాటు అప్పుడప్పుడు ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొంటారు. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటారు. తమకున్న ఈమేజ్, క్రేజ్, స్టార్‌డమ్‌తో పలు కంపెనీల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. తాజాగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా మరో బ్రాండ్‌కు ప్రచారం చేయబోతున్నట్లు ఫిలింనగర్‌ సర్కిల్ ఓ వార్త ప్రచారం జరుగుతోంది.

 

తాజా అప్‌డేట్ ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రముఖ కంపెనీతో భారీ మొత్తానికి బ్రాండ్ ఎండార్స్ మెంట్‌కు సంతకం చేసినట్లు సమాచారం. దాదాపు రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. టీవీ అండ్ డిజిటల్ కమర్షియల్ యాడ్ కోసం ఎన్టీఆర్ యాడ్ షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరిగినట్లు.. దానికి ఎన్టీఆర్‌ హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఫాంటా’ కూల్‌డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే కొత్త కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసం డైరెక్టర్ కొరటాల శివ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట. త్వరలోనే సినిమా షూటింగ్ పనులు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీయఫ్ ఫేమ్, డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌తో కలిసి మరో సినిమా చేయబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -