Virupaksha: సాయితేజ్ నటించిన విరూపాక్ష మూవీ ఎలా ఉందో తెలుసా?

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరూపాక్ష. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ మొదటగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా నేడు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాని ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్ లో వేశారు. ఈ ప్రీమియర్ షోలో భాగంగా పలువురు నిర్మాతలు సినీ సెలబ్రిటీలు బయ్యర్లు కూడా సినిమాని వీక్షించారు.

ఈ ప్రీమియర్ షో చూసిన అనంతరం విరూపాక్ష సినిమా గురించి పలువురు సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాల గురించి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సినిమా చూసిన అనంతరం పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు చాలా ఎక్సైట్ గా ఉందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో భయపెట్టే అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చాలా హైలెట్ అయిందని పలువురు తెలియజేశారు. సాయి ధరంతేజ్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉందని తన పాత్రకు చాలా న్యాయం చేశారని పలువురు వీరి క్యారెక్టర్లకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ అందించిన నేపధ్య సంగీతం, శ్యామ్ దత్త్ సినిమాటోగ్రఫీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అంతా చెబుతున్నారు. థ్రిల్లింగ్, హర్రర్, మిస్టరీని దట్టించి దర్శకుడు కార్తీక్ దండు గ్రిప్పింగ్ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని ఈ చిత్రంపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -