Nandamuri Heroes: నందమూరి హీరోలలో గ్రేట్ హీరో ఎవరో తెలుసా?

Nandamuri Heroes: నందమూరి వంశంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూకుడుగా ఉన్నారు. వీరిలో బాలయ్య సినిమా వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా మెగాస్టార్ సినిమా వాల్తీరు వీరయ్యకు పోటీగా నిలువనుంది. ఇకపోతే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి విదేశాలలో టూర్ కు వెళ్లారు. జనవరిలోనే ఆయన ఇండియాకు తిరిగి రానున్నరు.

 

నందమూరి వంశంలో తాజాగా మల్టీ స్టారర్ మూవీ ఇంత వరకూ రాలేదు. అయితే ఆ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే చూడాలని ఉందనేది చాాలా మంది కోరిక. కానీ వీరిద్దరికి పడదని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. బాబాయ్, అబ్బాయ్ కలిస్తే రికార్డులు తిరగరాయక తప్పదని అంటున్నారు. ఆ సినిమా చరిత్రలో బ్లాక్ బాస్టర్ హిట్ నిలవడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

తాజాగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లలో గొప్ప హీరో ఎవరని ఒక సంస్థ సర్వే నిర్వహించగా ఇద్దరు హీరోలు గొప్ప హీరోలేనని తమకు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది.

 

సంక్రాంతికి విడుదలయ్యే వీరసింహారెడ్డి సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్టింగ్ గా నిలిచారు. మెగాస్టార్ సినిమా వాల్తేరు వీరయ్య గట్టి పోటీ ఇస్తుండటంతో నందమూరి హీరోల ఫ్యాన్స్ ఒక్కటయ్యారు. దీంతో ఈ సారి గట్టి పోటీ అనేది నెలకొని ఉంది. మొత్తానికి బాలయ్య, ఎన్టీఆర్ లు కలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ అంటున్నారు. త్వరలోనే బిగ్ స్క్రీన్ పై వీరి సినిమాను చూస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై బాలయ్య, తారక్ ఏం అంటారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -