Chiranjeevi: చిరంజీవితో చెత్తగా బిహేవ్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?

Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో కష్టపడి ఎదిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్‌గా కూడా రాణించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటించారు. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ.. హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరంజీవి మాస్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా మెప్పించాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెరీర్ మొదలు పెట్టి సరైన కథలను ఎంపిక చేసుకుంటూ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. చిరంజీవి అప్పట్లో స్టార్ హీరోయిన్ రాధికతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించాడు. అంతేకాదు.. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన విజయశాంతితో కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన ‘పసివాడి ప్రాణం, స్వయం కృషి’ వంటి సినిమాలు ఇప్పటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ని పరిచయం చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాణిస్తూనే రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించాడు. ఆయన మొత్తం 149 సినిమాలో నటించి ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ రంగం వైపు అడుగులు వేశారు. ప్రజాసేవ కోసం ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కొద్దిరోజుల తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. చిరంజీవి రాజకీయాలకు విరామం ఇస్తూ మళ్లీ ఇండస్ట్రీకి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఓ హీరోయిన్ చిరంజీవిని చులకనగా చూసేదని వార్తలు వినిపించాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒక్కసారి చూద్దామా. అయితే అప్పట్లో సీనియర్ హీరోయిన్ మాధవి కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి చిన్న హీరో అని, ఆయనను చులకనగా చూసేవారు. చాలా సంవత్సరాల పాటు మాధవి ఈ భావననే కలిగి ఉంది. చిరంజీవికి సురేఖతో పెళ్లైన తర్వాత ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -