Sukumar: సుకుమార్‌ను భయపెట్టిన హీరోయిన్ తల్లి ఎవరో తెలుసా?

Sukumar: టాలీవుడ్ డైరెక్టర్లలో సుకుమార్‌కు స్పెషల్ ఈమేజీ ఉంది. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఎంతో మంది ప్రేక్షకులు సుకుమార్ తీసిన సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. హిట్ సినిమాలతోపాటు ప్లాప్ సినిమాలు కూడా బాగుంటాయి. స్టోరీ న్యారేషన్, డైలాగ్స్, హీరోహీరోయిన్‌ల కెమిస్ట్రీని బాగా చూపిస్తాడు. అందుకే ప్లాప్ అయిన సినిమాలను ప్రేక్షకులు చూసేందుకు కూడా జనాలు ఎక్కువ ఇష్టపడతారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ సినిమా థియేటర్లలో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. సినిమా ప్లాప్ అయిన తర్వాత చాలా మంది ఈ మూవీని చూడటానికి ఆసక్తి చూపించారు. రెండు, మూడు సార్లు సినిమా చూస్తే తప్పా.. ఈ సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారు. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.

 

 

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘నాన్నకు ప్రేమతో’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ సినిమాలు చేశారు. ఈ సినిమాలు కమర్షియల్ హిట్ అందుకున్నాయి. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌తో కలిసి తీసిన మూవీ ‘పుష్ప’. ఈ సినిమా మొదట్లో ప్లాప్ అవుతుందని గాసిప్స్ వినిపించినప్పటికీ.. పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ కొట్టడం విశేషం. ఈ సినిమాతోనే హీరో అల్లుఅర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా అవతారమెత్తాడు. దీంతో సుకుమార్ క్రేజ్‌ కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం సుకుమార్ పుష్పకు సీక్వెల్‌గా పుష్ప-2 సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఇలాంటి తరుణంలో సుకుమార్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్’పై సుక్కు శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో ’18 పేజేస్’ సినిమా తెరకెక్కింది.

 

 

‘18 పేజేస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సుకుమార్.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై సంచలన కామెంట్లు చేశాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్‌గా సమంత నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫస్ట్ లో హీరోయిన్‌గా అనుపమను అనుకున్నారట. అయితే సినిమా ఆడిషన్స్ సమయంలో.. అనుపను ఆడిషన్స్ చేస్తున్న ప్రతీసారి వాళ్ల అమ్మ వైపు చూసేది. వాళ్ల అమ్మగారు కూడా ఇటే చూసేవారు. దాంతో తనకు భయం వేసి.. అనుపమ స్థానంలో సమంతను తీసుకున్నామని సుకుమార్ చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -