Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో
నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ చివరి చిత్రం రాధే శ్యామ్ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు తదుపరి సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదల అవుతుంది అనుకుంటే ఆ సినిమా టీజర్ విడుదల కాగా భారీగా నెగటివ్ గా కామెంట్స్ రావడంతో ఆ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ అలాగే అభిమానులు ప్రభాస్ పెళ్లి శుభవార్త కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ హెల్త్ కి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి రెండు రోజుల ముందు ఆరోగ్య పరమైన విషయంలో కాస్త ఎక్కువగానే ఇబ్బంది కలగడంతో ఆశ్రద్ధ చేస్తే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో ప్రభాస్ వెంటనే అన్ని షూటింగ్స్కు బ్రేక్ చెప్పేసి స్పెషల్ ఫ్లైట్లో ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అయితే నాలుగు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూన్న ఓ పెద్ద స్టార్ హీరో ఉన్నట్లుడి ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లేంత ఆరోగ్య సమస్య ఏంటనేది అభిమానులకు అంతు పట్టడం లేదు. డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ కి ఏమైయిందా అని టెన్షన్ పడుతున్నారు. దానికి తోడు చిత్ర బృందం నుంచి కూడా ప్రభాస్ ఆరోగ్యం పై ఎటువంటి లేకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. అయితే ప్రభాస్ ఆరోగ్యం విషయం గురించి ఎవరూ స్పందించడం లేదు అంటే అంతా పెద్ద సమస్యలు ఉన్నాయా, అంతా అనారోగ్యంతో బాధపడుతున్నారా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ కామెంట్స్ పై కూడా ఎవరు స్పందించడం లేదు.