Adipurush: ఆదిపురుష్ డైరెక్టర్ కి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడా.. అసలు నిజం ఇదే?

Adipurush: గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఆది పురుష్ టీజర్ ను నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ టీజర్ లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలు చూసేవారికి పూర్తిగా తోలుబొమ్మలాటలా కనిపించింది. దాంతో ఈ సినిమాను యానిమేషన్ గ్రాఫిక్స్ తో నిర్మించారని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభాస్ అభిమానులకు చిన్న చూపుగా మారింది.

దీంతో ప్రభాస్ అభిమానులు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై టీజర్ విషయంలో మండిపడుతున్నారు. ఇక ఈ టీజర్ ఇంత ట్రోల్స్ క్రియేట్ చేసిన విషయం పట్ల ప్రభాస్ కూడా డైరెక్టర్ పై మండిపడినట్లు ఒక న్యూస్ వైరల్ అయింది. అలా ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ని సీరియస్ గా రూమ్ కి రమ్మని పిలిచినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ వార్తలకు దర్శకుడు వర్మ క్లారిటీ ఇచ్చాడు.

ఒక న్యూస్ ఛానల్ డిబెట్ లో పాల్గొన్న వర్మ ప్రభాస్ ఆదిపురుష్ డైరెక్టర్ ని తిట్టాడు అనడంలో నిజం లేదని అన్నాడు. దానికి వర్మ ఒక లాజిక్ కూడా బయటకు తీసుకొచ్చాడు. ప్రభాస్ సన్నిహితుడు చెప్పిన సమాచారం ప్రకారం.. నిజానికి ఆది పురుష్ టీజర్ కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభాస్ రూమ్ కి ఓమ్ రౌత్ ను పిలిచాడు. తమ టీజర్ ట్రోల్స్ కి గురైందని ప్రభాస్ కి తెలియదు.

అలాగే ప్రభాస్ రిలీజ్ కి ముందే ఆదిపురుష్ టీజర్ ను చూసి ఉంటాడు. ఒకవేళ ఆ టీజర్ ప్రభాస్ కి నచ్చకపోతే విడుదల చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. ఆయన పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. అంతేకాకుండా నవ్వుతూ మాట్లాడతాడు. అలా చూసిన ప్రభాస్ ఏదో ఏమరపాటుగా ఓం రౌత్ ని అలా పిలవడం వారికి కొత్తగా అనిపించింది. కాబట్టి ప్రభాస్ డైరెక్టర్ పై కోప్పడ్డ విషయం నిజం కాదని డైరెక్టర్ వర్మ చెప్పుకు వచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -