Roja: కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ నటి రోజా.. ఏమైందంటే?

Roja: ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర షోలలో జడ్జిగా రోజా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలలో ఉంటూ ప్రజాదరణ పొందుతున్నారు. మంత్రి పదవి వచ్చాక రోజా జబర్దస్త్ ఫోకు గుడ్ బై చెప్పారు. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా ఎప్పుడూ ఏదోక వివాదంలో నిలుస్తూ వైరల్ అవుతుంటారు.

 

ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా తన కూతురి గురించి ఓ విషయం చెప్పారు. పలు ఫోటోలతో అసభ్యకరంగా రోజా కూతురిని ఇబ్బంది పెట్టినట్లు ఆమె మీడియాకు తెలిపారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమనిని రోజా పెళ్లి చేసుకున్నాక రాజకీయాలు, సినీ లైఫ్ లో తాను బిజీ ఉన్నానని, అయితే ఫ్యామిలీకి మాత్రం సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు.

 

తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె దగ్గరుండి చూసుకోవడం వల్ల తన కూతుర్ని ఏడిపించిన ఆకతాయిలకు బుద్ది చెప్పానని రోజా అన్నారు. గతంలో చాలా సార్లు తమ పిల్లలకు దగ్గరుండి వండి పెట్టడానికి కూడా టైం ఉండేది కాదని, రాజకీయ పరిస్థితుల వల్ల ఫ్యామిలీ లైఫ్ కి కొంత దూరం అయ్యానని రోజా చెప్పుకొచ్చారు.

 

కరోనా వచ్చిన తర్వాత ఇంటిపట్టునే ఉంటూ పిల్లలకు స్వయంగా వండి పెట్టి వారిని ప్రేమగా చూసుకోవడం ఆనందం అనిపించిందని, సోషల్ మీడియాలో దారుణంగా తనపై ట్రోల్స్ వస్తుండటాన్ని పట్టించుకోనని తెలిపారు. తన పిల్లలు కూడా ట్రోల్స్ చేసేవారి వల్ల ఇబ్బంది పడ్డారని, తన కూతురి ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేయడం బాధగా అనిపించిందని రోజా తెలిపారు. అలాంటి ట్రోల్స్ వల్ల తన కూతురు చాలా సార్లు బాధపడిందని, తన కూతురు చాలా సెన్సిటివ్ అని అందుకే తాను తన కూతురి పట్ల ప్రత్యేకంగా చూసుకునేదానిని అని తెలిపారు. తన పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల వారు ఇప్పుడు ఏ బాధ లేకుండా ఉన్నట్లు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -