RRR: ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ పై ప్రముఖ నిర్మాత ఫైర్.. ఏమైందంటే?

RRR: ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య లేకుండా ఆస్కార్ గ్రహీతలకు ఇంత అర్జెంటుగా సన్మానం ఎందుకు చేశారని నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించాడు. గతేడాది విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఇటీవల జరిగిన 95 వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వరించింది.

మొట్ట మొదటిసారిగా ఆస్కార్ అవార్డు అందుకున్న తెలుగు సినిమాగా ఆర్ ఆర్ ఆర్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆస్కార్ అవార్డ్ అందజేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో దేశం మొత్తం గర్వించింది.ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు.

ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్లో ఆస్కార్ అవార్డు గ్రహీతలకు సన్మానం జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య, హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ లేకుండానే ఇలా అభినందన సభ ఏర్పాటు చేశారు ఇలా వీరందరూ లేకుండా ఈ సన్మాన సభను ఏర్పాటు చేయడంతో నిర్మాత నట్టి కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ ఇలా చిత్ర బృందం మొత్తం లేకుండా సన్మానం చేయడం చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన నట్టి కుమార్ మాట్లాడుతూ..” తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. ఎవరికి తెలియకుండా ఆస్కార్ సాధించిన వారిని అంత అర్జెంటుగా ఎందుకు సన్మానించారు అంటూ నట్టి కుమార్ ప్రశ్నించాడు. ఈసీ అప్రూవల్ లేకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి రూ .25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు ? అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -