Gujarat: ప్రస్తుత కాలంలో శని పరిశ్రమకు చెందిన నటి నటులు ఎవరో ఒకరు మృతి చెందుతూ ఇండస్ట్రీకి తీరనిలోటు ఇప్పటికే ఎంతోమంది మృతి చెందగా తాజాగా ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి ప్రస్తుతం కలకలం రేపుతోంది. కారు వెనుక సిటీలో ఆమె విగతజీవిగా పడి ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఈ ఘటన గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో కనిపించింది. కాగా సమీపంలోని పార్ నదీ ఒడ్డున కారు చాలాసేపు ఆగి ఉండటంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆ కారుని పరిశీలించారు.
ఆ కారు తనిఖీ చేస్తున్న సమయంలో బ్యాక్ సీట్లో ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం ఎవరిదా అని చూడగా అది ప్రముఖ సింగర్ వైశాలి బల్సారాగా పోలీసులు గుర్తించారు.. అయితే మధుదేహాన్ని ఆధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా వైశాలి భర్త హితేశ్ కూడా సింగర్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు స్టేజ్ షోలలో కూడా పాల్గొన్నారు. ఇక ఇటీవల శనివారం అర్థరాత్రి 2గంటలకు తన భార్య కనిపించడం లేదని హితేశ్ పోలీసులకు సమాచారం అందించాడు.
ఈలోపే ఆమె ఇలా కనిపించడంతో ఆమె భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కాగా సింగర్ వైశాలి అనుమానాస్పద మృతి వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయం పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సింగర్ వైశాలి మృతి పట్ల సినీ ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సింగర్ వైశాలి అనుమానాస్పద మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.