Adipurush: ట్రైలర్ చూసి ఆ మాట అంటున్న ఫ్యాన్స్!

Adipurush: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది. టీజర్ ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా సినీ ప్రియులు అందరినీ అబ్బుర పరిచే లాగా ఉంది. అఫీషియల్ గా విడుదల చేయడానికి ఒకరోజు ముందే హైదరాబాద్ ఏ ఎం బి థియేటర్లో ఆధిపురుషు ట్రైలర్ ని స్క్రీనింగ్ చేశారు మూవీ మేకర్స్.

 

థియేటర్లోకి మీడియా వాళ్ళని రానివ్వలేదు ఎందుకంటే కేవలం ఫ్యాన్స్ కోసమే అంటూ ముందుగానే చెప్పారు మేకర్స్. స్వయంగా ప్రభాస్ రావటంతో షో గంట ఆలస్యంగా స్టార్ట్ అయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు.

 

ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందా అని విశ్లేషిస్తే ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ తెప్పించే లాగా ఉంది. చేతను అపహరించడం మొదలుపెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం చేస్తూ చివరికి రామ రావణ యుద్ధం షాట్ తో ట్రైలర్ ముగిసింది. ట్రైలర్ ట్రైలర్ లోని విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

 

టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎంతగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే సైఫాలు మీద రామ సైన్యం పై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. దర్శకుడు ఓం రౌత్ స్టార్ హీరో ప్రభాస్ ని పెట్టి పిల్లల సినిమా తీశాడంటూ చాలా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు అన్నింటికీ చెక్ పెట్టింది ఈ ట్రైలర్.

 

టీజర్ కి నెగిటివ్ కామెంట్స్ రావటంతో జాగ్రత్త పడ్డ మూవీ మేకర్స్ బిఎఫ్ కోసం అదనంగా 100 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఖర్చు ఫలితం ఆది పురుష ట్రైలర్లో కనిపిస్తుంది. ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమా మీద హైట్ పెంచే క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమైంది టి సిరీస్ సంస్థ. రామాలయాల్లో సైతం ప్రమోషన్లు చేయటానికి సిద్ధపడినట్లుగా సినీ వర్గీయుల సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -