Prabhas: నడవలేకపోతున్న ప్రభాస్.. ఆందోళనలో అభిమానులు!

Prabhas:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ సినిమా అవకాశాలు అందుకుంటూ షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు. తాజాగా ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది పురుష్ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి చూసి తన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల డార్లింగ్ మోకాలికి సర్జరీ అయిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఇతడు ప్రస్తుతం దాని నుంచి కోలుకోలేదని తెలుస్తుంది. ఇక ప్రభాస్ నటించిన ఆది పురుష్ ఫస్ట్ లుక్ టీజర్ ను ఆదివారం మేకర్స్ విడుదల చేసారు. అయోధ్యలో భారీ స్థాయిలో విడుదల అయిన ఈ టీజర్ లాంచ్ కు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ హాజరయ్యారు.

ఇక టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ రాంప్ పై కొంచెం మరోలా నడవడం ప్రభాస్ అభిమానులు గమనించారు. అలా నడవడానికి కూడా ప్రభాస్.. కృతి, ఓం రౌత్ సహాయం తీసుకున్నారు. డార్లింగ్ వీరిద్దరి సహాయం తీసుకున్నారు ఎందుకు? డార్లింగ్ గాయం నుంచి ఇంకా కోలుకునేదేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడని కొందరు ఆందోళన చెందుతున్నారు.

ఇక తాజాగా విడుదలైన ఆది పురుష్ టీజర్ మాత్రం ప్రభాస్ అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమా కార్టూన్ సినిమాలా ఉందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ తో 500 కోట్లు ఖర్చుపెట్టి యానిమేషన్ కార్టూన్ సినిమా తీశారని కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి ఇన్ని రకాల ట్రోల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఏ విధమైన వార్త అందిస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ఇప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -