Telangana employees: తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏం జరిగిందంటే?

Telangana employees: తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకు తీపి గబురు చెప్పింది. సెర్ప్‌ ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉన్న 3,978 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమ‌లుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగుల క‌నిష్ఠ పే స్కేలు రూ.19 వేల నుంచి రూ.58,850లు కాగా, గ‌రిష్ఠ పే స్కేలు రూ.51,320 నుంచి రూ.1,27,310లుగా నిర్ణ‌యించింది.

 

ఈ పెంచిన జీతాలు ఏప్రిల్‌లోనే ఉద్యోగులకు అందనున్నాయి. ఈ వార్తతో సెర్ప్‌ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జీతాలా పెంపు డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా.. రాష్ట్రం ఎట్టకేలకు ఇప్పుడు కనికరించింది. అయితే.. ఈ జీతాల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.580 కోట్ల అదనపు భారం పడనుంది.

ఉద్యోగుల క్యాడర్ ని పెట్టి జీతాలు పెరగనున్నాయి. ఈ క్రింది విధంగా జీతాలు పెరుగుదల ఉండనుందని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలిసింది. మండ‌ల స‌మాఖ్య క‌మ్యూనిటీ కో-ఆర్డినేట‌ర్లకు రూ.19,000–58,850 ఉంటుంది. మండ‌ల స‌మాఖ్య క‌మ్యూనిటీ కో-ఆర్డినేట‌ర్స్‌రూ.19,000–రూ. 58,850, మండ‌ల బుక్ కీప‌ర్లకు – రూ.22,240–రూ.67,300, డ్రైవ‌ర్లకు – రూ.22,900–రూ.69,150 పెరగనుంది.

 

మరోవైపు ఆఫీస్ సబార్డినేట్లకు – రూ.19,000–రూ.58,850, క‌మ్యూనిటీ కో-ఆర్డినేట‌ర్లకు – రూ.24,280–రూ.72,850, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజ‌ర్లకు – రూ.32,810–రూ.96,890, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజ‌ర్లకు – రూ.42,300–1,15,270,ప్రాజెక్ట్‌ మేనేజ‌ర్లకు – రూ.51,230–రూ.1,27,310,, అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్ర‌ట‌రీస్ – రూ.24,280–రూ.72,850 ఉండనుంది.

Related Articles

ట్రేండింగ్

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ...
- Advertisement -
- Advertisement -