Gopichand: టాలీవుడ్ క్షేత్రంలో హీరోగా తన కెరీర్ ప్రారంభించిన గోపీచంద్.. ఆ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నాడు. మరికొన్ని రోజులకు విలన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులు మెప్పించాడు గోపీచంద్. అయితే హీరోగా పొందిన ఇమేజ్ కంటే విలన్ గా ఎక్కువ పాపులర్ అయ్యాడు గోపీచంద్. “వర్షం” మరియు “నిజం” సినిమాల్లో ప్రతినాయకుని పాత్రల్లో అద్భుతమైన నటనతో మంచి మార్కులు పొందాడు. ఆ తర్వాత మళ్ళీ మంచి హీరో పాత్రల్లో మెప్పించాడు. ఇలా సినిమాల్లో పడి తన జీవితంలో ప్రేయసికి దూరం అయ్యాడని మాట్లాడుకుంటున్నారు జనాలు.
“తొలివలపు” సినిమాతో మొట్ట మొదటి సారిగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు గోపీచంద్. ఆ సినిమాలో హీరోయిన్ గా తన ప్రక్కన నటించిన స్నేహ పై మనసుపడ్డాడట. అదే క్రమంలో తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. ఇదిలా ఉండగా ఒక రోజు స్నేహ.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకూ గోపీచంద్ మనసు ముక్కలు అయిపోయిందట. తాను అలా మాట్లాడటంతో గోపీచంద్ మనసు చంపుకుని ఆమెను మర్చిపోయాడట.
గోపీచంద్ నాకు అన్న లాంటి వాడు..
ఒకరోజు షూటింగ్ లో మాట్లాడిన స్నేహ.. గోపీచంద్ ని సొంత అన్నయ్య లాగా ఫీల్ అవుతున్నానని చెప్పడంతో.. అది విన్న గోపీచంద్.. ఒక్కసారిగా తన మనసు ముక్కలైపోయిందట. ఆ తర్వాత నుండి బాగా దెబ్బతిన్న గోపీచంద్ సైలెంట్ అయిపోయాడట. అక్కడితో గోపీచంద్ ప్రేమ కథకు ఫుల్ స్టాప్ పడిపోయింది. అలా తన ప్రేయసి స్నేహ ను వదులుకోవాల్సి వచ్చిందట గోపీచంద్.
ఇక ప్రస్తుతం గోపీచంద్ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం కొనసాగిస్తున్నాడు. సినీ జీవితంలో కూడా మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి తన మిత్రుడు, హీరో ప్రభాస్ తో కలిసి పాల్గొన్నాడు. ఇక దానిలో తన మనసులోని మాటలను షేర్ చేసుకున్నాడు గోపీచంద్. ఇదిలా ఉండగా స్నేహ కూడా పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో చక్కగా సంసారాన్ని గడుపుతుంది.