Pawan Kalyan: పవన్ కోసం చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా?

Pawan Kalyan:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సినిమాల్లో చేసి ప్రాణాలిచ్చే అభిమానులను సొంతం చేసుకున్న పవన్.. రాజకీయాల్లోనూ మోరల్ పాలిటిక్స్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా రాజకీయంగా కాస్త సైలెంట్ గా ఉన్న పవన్ ప్రస్తుతం కొంత చురుగ్గా వ్యవహరిస్తున్నాడు.

 

ఈ క్రమంలో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వం కావాలనే జనసేనానిని, జనసేన కార్యకర్తలను అణచివేస్తున్నారని.. విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య ఏపీ లో రాజకీయ పరిణామాలు చూస్తే.. పవన్ వైజాగ్ పర్యటన తదనంతర పరిణామాలు.. రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించాయి. పవన్ ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జనసేన చైతన్యవంతంగా ప్రజలకు చేరువ అవుతుందని ప్రకటించారు.

 

ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలను ఓ వార్త కలవర పెడుతుంది. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆగంతకులు అనుసరించి, పవన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం. ఇక ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం పవన్ కు సెక్యూరిటీని పెంచాయి. ఈ క్రమంలో పవన్ కు ప్రాణహాని ఉందని రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెగా పవర్ స్టార్ బాబాయ్ కోసం సొంత ఖర్చులతో ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు సమాచారం.

 

పవన్ కు ప్రస్తుతము ఉన్న భద్రతతో పాటు, రామ్ చరణ్ కేటాయించిన భద్రత అదనంగా ఉండనుంది. ఇక పవన్ ఎక్కడికి వెళ్తున్నా ఆరు కార్లు ఆయన వెనకాలే వెళ్లేట్లుగా.. 24X 7 పవన్ ను అనుసరించేట్టుగా చరణ్ సెక్యూరిటీ ప్లాన్ చేశారట. అంతేకాకుండా.. ఏ రాజకీయ నాయకుడు అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా పవన్ ఇంట్లోకి అనుమతించరు. పూర్తిగా సెక్యూరిటీ చెక్ చేశాకే ఎంతటి వారినైనా లోపలికి అనుమతిస్తారు. మొత్తానికి పవన్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందనే సమాచారం అందర్నీ విస్మయానికి గురి చేసింది.

Related Articles

ట్రేండింగ్

Ambati Rambabu: చెత్తకుప్పల్లోకి చేరిన వైసీపీ టీ కప్పులు.. ప్రచారం వికటిస్తోందిగా జగన్?

Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది...
- Advertisement -
- Advertisement -