Keerthy Suresh: కీర్తి సురేష్‎ని ఇలా ఎప్పుడైనా చూశారా?

Keerthy Suresh: అలనాటి తెలుగు ప్రేక్షకులకు మరుపురాని పేరు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మహానటి సావిత్రి. సినిమా రంగంలో తన చెరిగిపోని ముద్రను వేసిన సావిత్రి అకాల మరణం కోట్ల మందిని బాధించింది. అయితే ఆమె జీవిత కథను సినిమాగా తీస్తే చూడాలని ఎంతో మంది కోరుకునే వారు. అయితే సావిత్రిని పాత్రను ఎవరు పర్ఫెక్ట్ గా చేయగలరనే ప్రశ్న తలెత్తేది. అయితే వాటికి కీర్తి సురేష్ తన నటనతో సమాధానం చెప్పింది.

 

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమాను తెరకెక్కించగా.. ఆ సినిమాలో లీడ్ రోల్ ని హీరోయిన్ కీర్తి సురేష్ చేసింది. అద్భుతంగా సావిత్రిని దించేసిన కీర్తి సురేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. అయితే ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కీర్తికి తర్వాత మాత్రం హిట్ దొరకలేదు.

 

దాంతో తన షేప్ ని మార్చుకొని.. బొద్దుగా కనిపించే తన రూపాన్ని సన్నగా మార్చుకోవడంతో పాటు గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పింది కీర్తి సురేష్. అలా మహేష్ తో చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమా హిట్ అవడంతో.. కీర్తి సురేష్ ఖాతాలో కూడా ఓ హిట్ చేరినట్లైంది. కాగా గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పుకుంటూ పోతున్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో కూడా గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.

 

కీర్తి సురేష్ ప్రస్తుతం థాయ్ లాండ్ లో వెకేషన్ లో బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అమ్మడు తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరూ షాక్ అవుతున్నారు. స్విమ్ సూట్ లో నీటిలో ఉన్న కీర్తి సురేష్.. తడి జట్టు, బ్లాక్ గాగుల్స్ తో పక్కనే ఉన్న ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం.. గతంలో ఎప్పుడూ ఇంత హాట్ గా కీర్తి సురేష్ ని చూడలేదని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -