Radha: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటికి సీనియర్ హీరోయిన్ నటి రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈతరం ప్రేక్షకులు నటి రాధ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ బీబీ జోడి షో జడ్జ్ రాధ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ షోతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది రాధ. అంతేకాకుండా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన రాధ దాదాపుగా తన సినిమా కెరియర్ లో 250కు పైగా సినిమాలలో నటించి మెప్పించింది.
అంతేకాకుండా 1980 కాలంలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. కాగా రాధ అసలు పేరు ఉదయ్ చంద్రిక కాగా ఆమె సినిమాలలో రాధ అనే పేరుతోనే మంచి ఫ్యామిలీ సంపాదించుకుంది. ఇక బాగా పిక్స్ లో ఉన్న సమయంలో ముంబైకి చెందిన ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది. నటి రాధ కూతురు కార్తిక నాయర్ గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగులో హీరోయిన్గా నటించిన ఇప్పించింది. కానీ సినిమా అవకాశాలు రాకపోవడంతో బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇకపోతే నటి రాధా తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది. హీరో కమలహాసన్ తో కలిసి నటించిన సినిమాలోని ఫోటోని పంచుకుంది రాధ. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.
టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదీ కూడా ఒకటి. అప్పటికి అది నా కెరీర్లో ఒక భాగం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్న. సరైన లుక్తో కనిపించిన మాధవి కి కూడా ప్రత్యేక ప్రశంసలు.
యాటిట్యూడ్ తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్. కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆలాంటి కొన్ని చెప్పలేని ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నా. ఈ అందమైన దుస్తులను తయారు చేసిన డిజైనర్ వాణీ గణపతికి మా కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది రాధ. కాగా రాధ షేర్ చేసిన ఆ ఫోటోలలో ఆమె బికినీలో కనిపించి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. రాధను అలా చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆ ఫోటోలో కమల్ హాసన్ కుర్చీలో ఉండగా.. రాధ, స్వప్న, మాధవి ఆయన వెనక నిలబడి ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.