Health Tips: వామ్మో.. కాల్చిన చికెన్ తింటే అంతే సంగతి!

Health Tips: ఈ మధ్యకాలంలో చాలా మంది నాన్ వెజ్ తినడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నాన్ వెజ్ లో రకరకాల రుచు లతో కూడిన స్టఫ్స్ ఉండటం వల్ల నాన్ వెజ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వందలో 80 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చికెన్ తో చేసిన రకరకాల ఐటమ్స్ తినాలని బాగా లొట్టలేసుకుంటారు.

 

మామూలుగా నాన్ వెజ్ శరీరానికి ఒకింత మంచిదే అయినప్పటికీ.. అది పదే పదే తినడం వల్ల కొన్ని ప్రమాదకరమైన జబ్బులు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది నాన్ వెజ్ ను అదే పనిగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం.

 

బయటికి వెళ్తే చాలు చికెన్ కి సంబంధించినవి స్ట్రాటర్స్ బాగా తింటున్నారు నేటి జనాలు. అయితే అందులో తందూరి చికెన్ మాత్రం మరి ఇష్టంగా తింటున్నారు. కానీ ఇది తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా అమెరికా మిన్నేసోటా వర్సిటీ చేసిన పరిశోధనలో బయటపడింది. చికెన్ నిప్పులపై కాల్చి తింటే ప్రమాదమని తెలిపారు.

 

ఇక కాల్చిన చికెన్ ను తినని వారితో పోలిస్తే తినేవారిలో 60% మందికి ప్యాంక్రి యాటిస్ అనే క్యాన్సర్ వస్తుందట. అంటే చికెన్ ను మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని మీద ఉన్న పై పొర లో క్యాన్సర్ కి సంబంధించిన సమ్మేళనాలు, పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రో కార్బన్ ఏర్పడతాయని పరిశోధనలో తేలింది. దీంతో అటువంటి చికెన్ తినడం తగ్గించడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి నాన్ వెజ్ ఎంత తక్కువ తింటే అంత మంచిదని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -