Tabu: సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. ఇంతకు ముందు ఆమె చేసే సినిమాల ద్వారా వార్తల్లో నిలిచేవారు. అయితే ఈ మధ్య ఆమె పర్సనల్ విషయాల వల్ల వార్తల్లో ఉంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత చాలా మందికి ఆమె టార్గెట్ గా మారారు. ఎప్పుడెప్పుడు ఆమెని ట్రోల్ చేద్దామా అని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటీవల సమంత తనకున్న వ్యాధి గురించి అందరితో పంచుకున్న విషయం తెలిసిందే.
అయితే దీని మీద కూడా కొందరు ఆమెని ట్రోల్ చేశారు. అయ్యో సమంత కి ఇలా జరిగిందే అని బాధపడకపోవడం అటుంచి ఆమెని మరీ ఘోరంగా ట్రోల్ చేశారు. ఇలాంటివన్నీ చూసిన సమంత సోషల్ మీడియాకి కొద్దిగా దూరం ఉంటున్నారు. వీటి గురించి పట్టించుకోకుండా తన పని మీద నిమగ్నం అయ్యింది సమంత. ఖుషీ సెట్స్ తో త్వరలో అడుగు పెట్టబోతోంది. సీనియర్ నటి టబు ఇందులో ప్రధాన భూమిక పోషించబోతున్నటు సమాచారం.
మీడియా సమాచారం ప్రకారం సమంత టబు కూతురు. విజయ్ తో పెళ్లి జరిగిన తరువాత సమంత తల్లి చరిత్ర తెలుసుకుని విడాకులు ఇవ్వాలి అనుకుంటునప్పుడు టబు వచ్చి కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ చెపుతుంది. ఆ డైలాగ్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట.
అలాంటి ఒక డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ఆ సుఖం కోసమే పెండ్లి చేసుకునే మగాళ్లకు కోసి కారం పెట్టాలి’ అని డైలాగ్ చెపుతుందట టబు. డైలాగ్ కొద్దిగా వల్గర్ గా ఉన్నా కూడా సిచువేషన్ గా దగ్గరగా ఉండడంతో థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుందట సినీ ప్రియుల నుంచి. అయితే సమంత అభిమానులు మాత్రం ఈ డైలాగ్ తమ అభిమాన హీరోయిన్ ఫేస్ చేసిన ట్రోల్స్ అనుభవాలకు దగ్గరగా ఉంటుంది అంటున్నారు. గతంలో మజిలీ చిత్రంతో సమంతకి మంచి విజయం అందించిన శివ నిర్వాణ ఖుషీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.