ఆ తర్వాత ఆ వ్యాపారికి ఆయన వ్యాపారం ఎలా జరుగుతుందని ఆప్యాయంగా పలకరించాడు. ఇది చూసిన కొందరు ముఖ్యమంత్రి మనవడు వచ్చాడంటూ గుమిగూడి సెల్ఫీ తీసుకున్నారు. చాలా మంది ఒక్కసారిగా ఎగబడిన హిమాన్షు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా తన వచ్చిన వారిందరిని నవ్వుతూ పలకరిస్తే సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం మళ్లీ రేస్ వద్దకు స్నేహితులకు కలిసి వెళ్లాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తండ్రి లాగా ప్రజల్లోకి దూసుకెళ్లే వ్యక్తిత్వం హిమాన్షుది అని కొందరు.. రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడైన కూడా ఎలాంటి గర్వం లేకుండా సామాన్య ప్రజల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదని మరికొందరు హిమాన్షుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.