Himanshu: రోడ్డు పక్కన బెల్‌పురి తిన్న ముఖ్యమంత్రి మనవడు!

Himanshu: సెలబ్రెటీలు, ప్రముఖులు అయినా వారి పిల్లలైనా అరుదుగా బయటకు వస్తారు. వారు బయటకు వచ్చినా తినే ఫుడ్‌ చాలా కాస్లీగా ఉంటుంది. రోడ్లు పక్కనే విక్రయించే ఆహార పదార్థాల జోలికి అస్సలు పోరు. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి, మనవడు, పరిశ్రమల శాఖ మంత్రి కొడుకు సాధారణ వ్యక్తిలాగా ఫుట్‌పాత్‌పై అమ్మే బెల్‌పురి తిని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. గత మూడ్రోజులుగా హైదరాబాద్‌లో ఫార్యులా వన్‌రేస్‌ జరుగుతుంది. శనివారం రేస్‌ను తన మిత్రులతో కలిసి చూడటానికి వెళ్లిన హిమాన్షు కాసేపటి తర్వాత రోడ్డు పక్క చిన్న బుట్ట వ్యాపారి దగ్గరకు వెళ్లి సొంతంగా బేల్‌పురి కొనుక్కుని తిన్నాడు. అంతేకాక తన వెంట ఉన్న మిత్రులకు కూడా తన కొనిచ్చాడు.

ఆ తర్వాత ఆ వ్యాపారికి ఆయన వ్యాపారం ఎలా జరుగుతుందని ఆప్యాయంగా పలకరించాడు. ఇది చూసిన కొందరు ముఖ్యమంత్రి మనవడు వచ్చాడంటూ గుమిగూడి సెల్ఫీ తీసుకున్నారు. చాలా మంది ఒక్కసారిగా ఎగబడిన హిమాన్షు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా తన వచ్చిన వారిందరిని నవ్వుతూ పలకరిస్తే సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం మళ్లీ రేస్‌ వద్దకు స్నేహితులకు కలిసి వెళ్లాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. వీడియో చూసిన కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తండ్రి లాగా ప్రజల్లోకి దూసుకెళ్లే వ్యక్తిత్వం హిమాన్షుది అని కొందరు.. రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడైన కూడా ఎలాంటి గర్వం లేకుండా సామాన్య ప్రజల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదని మరికొందరు హిమాన్షుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -