Namrata: టాలీవుడ్ ఇండస్ట్రీలో నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1993లో మిస్ ఇండియా గా ఎంపికైన ఈ నటి తెలుగులో వంశీ, అంజి వంటి సినిమాలలో నటించింది. వంశీ సినిమాలో హీరో అయిన సినీ నటుడు మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ.
ఆ తర్వాత ఇంటిని చక్కపెట్టుకునే బాధ్యతగల ఇల్లాలుగా ఉంటూ సినిమాలకి గుడ్ బై చెప్పింది నమ్రత. ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు కొడుకు గౌతమ్ కూతురు సితార. చిన్న వయసులోనే సితార సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భర్త మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉన్న సంగతి తెలిసిందే.
భర్త వెనకే ఉంటూ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ మహేష్ బాబు కి టెన్షన్ లేకుండా చేస్తుందంట నమ్రత. ఇదే విషయాన్ని మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చారు. దానికి కారణం స్ట్రెస్ లేకపోవడం స్ట్రెస్ లేకపోవటానికి కారణం నా భార్య అంటూ నవ్వుతూ చెప్తారు మహేష్ బాబు.
ఇంతకీ విషయం ఏమంటే అటు భర్తని ఇటు పిల్లలని చక్కబెట్టుకుంటూ ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే నమ్రతకి ఈమధ్య ఖాళీ దొరికిందట. అందుకు కారణం మహేష్ బాబు విదేశాల్లో ఉండటం. మహేష్ బాబు విదేశాల్లో ఉంటూ హెల్దీ బాడీ కోసం ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట మే 16 వరకు అయినా ఇండియాకు తిరిగి రారు.
పిల్లలకి ఎగ్జామ్స్ ఉండటంతో వారిని తీసుకొని ఇండియాకి వచ్చేసింది నమ్రత. ఎప్పుడు బిజీగా ఉండటం వల్ల తన ఫ్రెండ్స్ సర్కిల్ తో జరిగే కిట్టీ పార్టీలను మిస్ అవుతూ ఉండేదట నమ్రత. ఇప్పుడు ఖాళీగా ఉండటంతో తన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందర్నీ కలుస్తూ ఎంజాయ్ చేస్తుందట. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అమృత ఖాళీగా ఉందని తెలుసుకొని పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నారంట.