Roja: అన్ స్టాపబుల్ కు వెళ్లను.. రోజా సంచలన వ్యాఖ్యలు?

Roja: టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షోకి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. అంతేకాకుండా ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఈ షోపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అంతే కాకుండా అన్ స్టాపబుల్ షో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ముఖ్యంగా సీజన్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్ కి ఆహా సైట్ నే క్రాష్ చేసేలా అంచనాలు పెంచేసారు ఆహా షోనిర్వాహకులు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ కి అంచనాలు ఆ రేంజ్ లో ఉంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మామూలుగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఇటువంటి టాక్ షోలకు రావడం చాలా అరుదు అని చెప్పవచ్చు. అటువంటి హీరోలు టాక్ షోలకు రావడం అందులోనూ ఆ షోకి బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరించడంతో అంచనాలు మరింత పెరిగాయి.

 

ఇకపోతే ప్రభాస్ ఎపిసోడ్ ఒకటి టెలికాస్ట్ అవ్వగా, రెండో ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ షోపై మంత్రి రోజా ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా వెళ్ళను అంటూ తెగేసి చెప్పేసింది. తనని టిడిపి వాళ్ళు దారుణంగా అవమానించారని, ఇప్పుడు జనసేన కూడా తోడై తనపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారని, అయినప్పటికీ అన్ స్టాపబుల్ టాక్ షోకి ఆహ్వానము అందింది కానీ నేను ఆ షోకి వెళ్ళను అని తెలిపింది మంత్రి రోజా. ఆ షో ద్వారా చంద్రబాబు, బాలకృష్ణ లు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవం తప్పులేదు అని నిరూపించాలని చూసారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ అంటే సినీ కళాకారులకి దేవుడితో సమానం, అలాంటి వ్యక్తి అధికారాన్ని కూలదోసి, కూతురు భవిష్యత్తు కోసం బాలకృష్ణ తన బావ చంద్రబాబుతో ఆడిన నాటకాలు నచ్ఛలేదు అంటూ రోజా బాలయ్య బాబు పై చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

కాగా గత కొద్ది రోజులుగా రోజాపై బాలకృష్ణ అభిమానులు అలాగే టిడిపి వాళ్ళు భారీగా ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్తులు, నటనను పంచి ఇచ్చిన తండ్రిపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం కరెక్ట్ కాదు, చంద్రబాబు తప్పుచేయలేదని బాలకృష్ణ ప్రూవ్ చెయ్యాలని చూడడం దారుణం, అయినా బాలయ్యతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది, ఆయనతో నటించాను, కానీ నేను ఆ షోకి వెళితే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళతాయి. షోకి వెళితే పార్టీకి నష్టం కలుగుతుందని నేను ఆ షోకు రానని చెప్పాను అని తెలిపింది రోజా.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -