Marks: శరీర భాగాల్లో ఆ గుర్తులుంటే వారి భవిష్యత్‌కు తిరుగుండదు!

Marks: మనుషుల శరీరంలో కొన్ని భాగాలు ఒక్కో ఆకారంలో ఉంటాయి. ఆ ఆకారం పరిణామాలు కొన్ని సంకేతాలను సూచిస్తాయి. మనిషి శరీరంపై ఉన్న గుర్తులు, మచ్చలు, వారి అలవాట్లు, గుణాలను సూచిస్తాయి. అంతేకాక భవిష్యత్‌లో వారు ఎలా ఉంటారో కూడా సూచిస్తాయని సాముద్రిక శాస్త్రంలో తెలుపబడింది. సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు వీరికి కుటుంబ సుఖం, దాంపత్య సుఖం, భూమి సుఖం లభిస్తాయి. ఈ వ్యక్తులు కళా ప్రేమికులు. ఈ వ్యక్తులు దూరదృష్టి గలవారు. జీవితంలో మొదటగా జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ విజయం సాధిస్తారు.

 

ఒక వ్యక్తి చేతిలో చంద్రుడి గుర్తు ఉంటే సదరు వ్యక్తి చాలా అదృష్టవంతులు. అంతేకాక అలాంటి వారు సొసైటీలో వారంతకు వారే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వారు అన్ని భౌతిక ఆనందాలను. పొందుతారు. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్‌లో మంచి పేరు తెచ్చుకుంటారు. దీంతో పాటు ఈ గుర్తు ఉన్న వారు జీవితాంతం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట. వ్యక్తుల చేతిలో మకరం, జెండా చిహ్నం ఉంటే అది వారికి మంచి సంకేతమని శాస్త్రం చెబుతోంది. ఈ గుర్తు చేతిలో ఉంటే అలాంటి వారు ఎప్పుడూ కూడా డబ్బు కోసం వెతకాల్సిన అవసరం ఉండవు. వారి వద్దనే అవసరమయ్యే డబ్బు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు రాజ్యాధికారాన్ని పొందుతారు. ఇతరులకు సాయం చేసేందుకు కూడా వీరు ముందుంటారు.

 

సాముద్రిక శాస్త్రం ప్రకారం, శంఖం, కమలం లేదా చక్రం ఆకారం పాదాల మీద కలిగి ఉన్నవారు అదష్టవంతులుగా పరిగణించబడతారు. ఇలా ఉన్న వారు అతి తక్కువ సమయంలోనే అపారమైన సంపద సాధిస్తారు. ఎవరి సహాయం లేకుండానే వీరు డబ్బులు సంపాదించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. చేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వారికి సమాజంలో ఆదరణ ఉంటుంది. దీనితో పాటు ఈ వ్యక్తులపై లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ వ్యక్తులు వ్యాపారంలో మంచి పేరు సంపాదిస్తారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -