Health Tips: ఈ చిట్కాలు పాటిస్తే పీరియడ్స్ నొప్పికి సులభంగా చెక్.. ఏం చేయాలంటే?

Health Tips: సాధారణంగా మహిళలు ప్రతినెల నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.చాలామంది మహిళలు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఈ నొప్పితో బాధపడేవారు కనీసం పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ విధమైనటువంటి ఇబ్బందితో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొంద వచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

పీరియడ్స్ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల మనం ఈ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గడమే కాకుండా వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్య నుంచి కూడా కాస్త ఉపశమనం కలిగిస్తుంది.అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో చేతులతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

ఇక మీకు పీరియడ్స్ సమయంలో మీ పడకగదిని చాలా ప్రశాంతంగా చల్లగా ఉండేలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యం అయ్యి ప్రశాంతకరమైన నిద్ర వస్తుంది. ఇలా నిద్రపోవటం వల్ల నొప్పి నుంచి కూడా కాస్త ఉపశమనం పొందవచ్చు.ఇక పీరియడ్స్ సమయంలో కొంత సమయం పాటు యోగా ధ్యానం వంటి వాటిని చేయటం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

ఇలాంటి సమయంలో వాకింగ్, ఏరోబిక్, స్ట్రేచింగ్ వంటి వాటిని చేయడం ఎంతో మంచిది.ఇక పీరియడ్స్ సమయంలో వచ్చే వెన్నునొప్పి కడుపు నొప్పి సమస్య నుంచి బయటపడాలి అంటే హీట్ ప్యాడ్ లేదా హాట్ వాటర్ బాటిల్ తో వెనకవైపు పొట్టపై భాగంలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో నొప్పి, వికారం, కండరాల తిమ్మిరి సాధారణం. దీని నుండి ఉపశమనం పొందడానికి, మీరు పాలు లేకుండా అల్లం , నల్ల మిరియాలు టీ తీసుకోవచ్చు. ఇది కూడా నొప్పి నుంచి మీకు పూర్తి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -