Viral: ఈ తెలుగమ్మాయికి జరిగిన అవమానం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే!

Viral: సాధారణంగా మధ్యతరగతి నుంచి వచ్చిన వారి జీవితాలు చాలా బాధాకరంగా ఉంటాయని చెప్పవచ్చు. చాలీచాలని జీతాలు, కావాలి అన్నది కొనుక్కోలేక సర్దుకుపోతూ జీవించేస్తూ ఉంటారు. మద్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిల సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఒక అమ్మాయి కథ గురించి మనం తెలుసుకుందాం.. ఆమె ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.. తన కుటుంబంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఎంతో గారాబంగా పెంచి పెళ్లీడు రావడంతో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే ఆ యువతి మాత్రం కొడుకులు లేని తన తల్లిదండ్రులకు తానే ఆధారం అవ్వాలి అనుకొంది.

తనకు నచ్చిన ఉద్యోగం చేసి తన నాన్నకు సపోర్టుగా నిలిచింది. కానీ ఉన్న సమాజం మాత్రం ఆమెను చూసి కుళ్ళు కోవడంతో పాటు సమాజంలో మాదిరిగానే ఆమెను మార్చేయాలని అనుకుంది. అయితే ఒకరోజు ఆమె ఆఫీసుకు బయలుదేరాక ఇంతలో వర్షం పడింది. ఆమె వర్షంలోనే తడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి చేరుకుంది. అయితే అప్పటికే ఆమె బాగా తడిసిపోయింది. యువతి బట్టలు తడిసిపోవడంతో అక్కడే ఉన్న కొందరు అబ్బాయిలు ఆ అమ్మాయి వైపు అలాగే తదేకంగా చూడడం మొదలుపెట్టారు. వెంటనే ఆమె స్కార్ఫ్ తీసుకొని కప్పుకుంది. అలా అతి కష్టం మీద ఆమె అలాగే ఆఫీసుకు చేరుకోగా అక్కడ మొత్తం ఫైర్ ఆక్సిడెంట్ అవ్వడంతో గందరగోళంగా ఉంది. ఆఫీస్ లోని కంప్యూటర్ ప్లగ్ ఇన్స్ పెట్టె బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడం తో మంటలు అలుముకున్నాయి.

 

ఓ గది మొత్తం ఆ మంటలు వ్యాపించాయి. ఆమె ఆఫీస్ దగ్గరకి వెళ్లేసరికి ఆమె ఫ్రెండ్ ని హడావిడిగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలు వ్యాపించిన గదిలోనే ఆమెకూడా ఉండడంతో, ఆమె శరీరానికి కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆ యువతీ తన స్నేహితురాలతో ఆసుపత్రికి వెల్లింది. కాలిన గాయాలతో ఆమె స్నేహితురాలు విలవిలలాడుతోంది. అప్పుడు ఆ అమ్మాయి తనకు అప్పటివరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్ కి వచ్చేవరకు తన పరిస్థితి కూడా అలానే ఉందని తన మనసులో అనుకుంది. తన మనస్సు కూడా దహించిపోతున్న బాధను అనుభవించింది. తన ఫ్రెండ్ శరీరానికి మంటలవలన గాయాలయితే, తన మనసుకి కామపు చూపుల్తో మంట అంటుకుందని యువతి లో లోపల బాధపడింది. ఇలా చాలామంది అమ్మాయిలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -