Balayya: ‘అఖండ’ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక్కపాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరం అందించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇప్పటికే తనకంటే వయసు పైబడిన హీరోలతో సినిమాలు చేస్తోందన్న విషయం తెలిసిందే. అందుకే శృతిహాసన్కు సినిమాల్లో యువ హీరోలు, స్టార్ హీరోలతో నటించేందుకు పెద్దగా ఆఫర్లు రావట్లేదని ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోలతో నటించిన శృతిహాసన్తో యువ హీరోలు జతకట్టేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బాబుతో కలిసి వీరసింహారెడ్డి సినిమాల్లో నటిస్తోంది. బాలయ్య బాబుతో జతకట్టడంతో వయసు మాట మళ్లీ తెరపైకి వచ్చింది. బాలయ్య బాబు తనకంటే 26 ఏళ్లు చిన్నదైన శృతిహాసన్తో జతకట్టాడని ప్రచారం జరుగుతోంది.
కాగా.. రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనలపై ‘వీరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్గా నటిస్తుండగా.. అవినాష్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్కు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. #NBK108 టైటిల్ ప్రాజెక్ట్ తో అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఎఫ్-3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.