Tamannaah: వామ్మో.. తమన్నా అన్ని రూ.కోట్ల ఆస్తులు సంపాదించిందా?

Tamannaah: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే చాలా కష్టపడాలి. అందంతోపాటు పర్‌ఫెక్ట్ ఫిగర్ ఉండాలి. అందుకోసం హీరోయిన్లు భారీగానే శ్రమిస్తారు. అయితే.. అందంపై కాన్సన్ట్రేషన్ చేసే మంది హీరోయిన్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ పై పెద్దగా ఫోకస్ చేయరు. చాలా కొద్ది మందే బ్యాంక్ బ్యాలెన్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తారు. వారిలో అందాల ముద్దుగుమ్మ తమన్నా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. తమన్నా గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముట్టుకుంటే కందిపోయేంత అందం, సున్నితత్వం… పట్టుకుంటే ఎర్రపడిపోయేలా ఉంటుంది. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలొయింగ్ క్రేజ్ ఉంటుంది.

 

 

‘హ్యాపీడేస్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా తమన్నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. తమన్నాకు సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చి ఏ హీరోయిన్ సంపాదించనంత ఆస్తిని తమన్నా సంపాదించిందని పుకార్లు వినిపిస్తున్నాయి.

 

 

కొన్ని వందల కోట్లకు అధిపతురాలు. హీరోయిన్‌గా డబ్బులు సంపాదించి.. ఆ డబ్బులను బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేస్తోంది. అలాగే బంగారంపైనే పెట్టుబడి పెడుతోంది. అలాగే ఆమె దగ్గర ఏకంగా రెండు వజ్రాల మూటలు ఉన్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలకు ధీటుగా తమన్నా ఆస్తులను సంపాదించుకుంది. ఎంత ఆస్తి సంపాదించుకున్నప్పటికీ తమన్నా చాలా సింపుల్‌గా కనిపిస్తుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఆస్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు కూడా తమన్నాను ప్రశంసిస్తున్నారు. అమ్మడుకి అందంతోపాటు తెలివి తేటలు ఉన్నాయని, అవకాశాలు ఉన్నప్పుడే సినిమాలు చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -