YS Sharmila: వైఎస్ షర్మిల షాకింగ్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే కలిసిందా.. దీని వెనక ఏమైనా ప్లాన్లు ఉన్నాయా అంటూ ఆరాలు తీస్తున్నారు రాజకీయ వర్గాల వారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టీ పీ పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నా పార్టీలో ఎలాంటి అభివృద్ధి లేదని తెలుస్తోంది. కెసిఆర్ మీద ఇతర పార్టీల మీద దుమ్మెత్తి పోయడం తప్పితే ఈమె పెద్దగా సాధించినది ఏమీ లేదు. కనీసం ఒక ఉప ఎన్నికలలో కూడా పోటీ చేసే ధైర్యం లేదు ఈ పార్టీకి.

 

అందుకే ఈమె రాజకీయ పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇలాంటి పరిణామాలలోనే ఆమె శివకుమార్ ని కలవడం మరింత చర్చనీయాంసమైంది. అయితే షర్మిల తనని రాజకీయపరంగా కలవడానికి రాలేదని.. కేవలం తనకి శుభాకాంక్షలు తెలపటానికి మాత్రమే వచ్చిందని చెప్పుకొచ్చారు శివకుమార్.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ తో తనకి ఉన్న సాన్నిహిత్యం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు శివకుమార్. అంతేగాని రాజకీయానికి సంబంధించిన ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పుకొచ్చారు శివకుమార్. శివకుమార్ అలా చెప్తున్నప్పటికీ అసలు ఉద్దేశం వేరే ఉందని చెప్తున్నారు రాజకీయ వర్గాల వారు.

 

తెలంగాణలో ఒంటరి పోరు సాధ్యం కాదని తెలుసుకున్న షర్మిల రాజకీయ పొత్తుల కోసమే ప్రయత్నిస్తున్నట్లు కచ్చితంగా చెప్తున్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళ కావడంతో ఏమైనా రాజకీయాలు ఉంటే అక్కడ చేసుకోవాలి అన్నట్లుగా ఏపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కి రేవంత్ రెడ్డికి వాగ్వాదం జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఎన్నికల తరువాత ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో అడుగుపెట్టే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -