Pavitra Lokesh: గత కొంతకాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో నరేష్, పవిత్రల వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. పవిత్రకు కూడా అదివరకే పెళ్లి జరిగింది. ఇక పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చి నరేష్ తో తిరగడం మొదలుపెట్టింది. నరేష్ తన మూడో భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. అయినా కూడా అతడు బాగా రెచ్చిపోయాడు.
ఇక ఇటీవలే వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తుంది. వీరికి సంబంధించిన పెళ్లి వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే వీరి పెళ్లి జరిగిన సందర్భంగా పవిత్ర మొదటి భర్త, కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పవిత్ర లోకేష్ ఒక అవకాశవాది అంటూ.. విజయనిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్ల ఆస్తిని నొక్కేసిందని అన్నాడు. నరేష్, పవిత్ర ఇద్దరు కలిసి జల్సాలు చేస్తూ విజయనిర్మలమ్మ గారి కష్టార్జితాన్ని నాశనం చేస్తున్నారని అన్నాడు. పవిత్ర కు లెక్చర్ గా జీవించడం అంటే చాలా ఇష్టమని.. ఆమె డబ్బు మనిషి అని అన్నాడు. ఇక తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నరేష్ ని తగులుకుందని.. అతని దగ్గర డబ్బు అయిపోతే మరొకరి దగ్గరికి వెళ్లి పోతుందని షాకింగ్ కామెంట్ చేశాడు. ఇక నరేష్, పవిత్ర లది ప్రేమో.. వ్యామోహమో తెలియదు కానీ పవిత్ర లోకేష్ మాత్రం ఆకాశవాది అని.. డబ్బుపై ఆశతో తనను తన పిల్లలను మోసం చేసింది అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.