Aadya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో ఆమె మోడల్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. బద్రి సినిమా చేసే టైంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో జానీ అనే సినిమా కూడా వచ్చింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.
పెళ్ళికి ముందు పవన్, రేణులు ఇద్దరూ సహజీవనం చేశారు. అప్పుడే వారికి అకిరా నందన్ జన్మించాడు. ఓ కొడుకు పుట్టాక వీరిద్దరూ పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. అప్పుడు కూడా వీరు బాగానే ఉన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య పలు మనస్పర్ధలు వచ్చి విభేదాలు జరిగాయి. ఆ తర్వాత వారు కలిసి ఉండలేక విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల తర్వాత రేణుదేశాయ్ పిల్లల బాధ్యతలు మొత్తం తన భుజాన వేసుకొని వారిని చూసుకుంటూ బతుకుతున్నారు.
పిల్లలకు సంబంధించి ఏ విషయంలోనైనా వీరు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నా బుల్లితెరకు మాత్రం కాస్త దగ్గరవుతోంది. అలాగే రవితేజ సినిమాలో కూడా ఆమె ఓ పాత్ర చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు పలు విషయాలను పంచుకుంటూ యాక్టీవ్ ఉంటోంది.
పవన్ అభిమానులు కూడా రేణుదేశాయ్ కి చాలా సపోర్ట్ గా నిలుస్తుంటారు. తాజాగా రేణు దేశాయ్ తన పిల్లల్ని సరదాగా మంచు ట్రిప్ కు తీసుకెళ్లింది. పిల్లలతో తాను కారులో వెళ్తుండగా అక్కడంతా మంచుతో కప్పబడి ఉంది. ఆ సమయంలో ఆద్య కారులో నుండి మంచులోకి జంప్ చేయాలనిపిస్తుందని రేణు దేశాయ్ తో చెబుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.