Kerela: ఈ భార్య చేసిన పని ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Kerela: సాధారణంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో అందమైన ప్రేమ ఉంటుంది అయితే కొంతమంది తల్లిదండ్రులు ఆస్తిపై ఆశతో లేదా అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ పిల్లలని పావుగా వాడుకుంటూ ఉంటారు. దీంతో తమ జీవిత భాగస్వామిలకు చాలా నరకం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి ఆవేదన భరించలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఒక యువకుడు తన కూతురి మాటకోసం తను ఆప్యాయంగా పట్టే ముద్దు కోసం ఎనిమిది రోజులపాటు తన భార్య ఇంటి ముందు తిరుగుతూ చివరికి తాను అనుకున్నది నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులకు వచ్చింది.

 

కేరళకు చెందిన బైచిరాజు అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం అన్నా ప్రియా జాన్సన్ అనే యువతీతో వివాహం జరిగింది.బైచిరాజు న్యూజిలాండ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడుతూ తన భార్యతో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది.ఇక కూతురితో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి బైచిరాజు కూతురి కోసం కేరళలో కొన్ని ఆస్తులు కూడా కొనుగోలు చేసి అన్ని తన కూతురి పేరిట రాశారు. అయితే ప్రియా సైతం అతనితో చాలా బాగుండేది అయితే మెల్లిమెల్లిగా ప్రియా తన అన్నయ్య తల్లి చెప్పిన మాటలు విని తన భర్త వద్ద డబ్బులు లాగడం మొదలుపెట్టారు.

 

ఇలా తనని డబ్బుల కోసం వేధిస్తూ ఉండేది.ప్రియా సైతం మెల్లిమెల్లిగా తన భర్త నుంచి దూరం అవుతూ తన బావకు దగ్గర అయింది.తన భర్తకు తెలియకుండా రహస్యంగా తన భావతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు.అయితే ఒక రోజు బైచిరాజు ఆఫీసుకు వెళ్లి ఒంట్లో బాలేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. హాల్లో కూతురు ఒకటే కూర్చోవడం చూసిన తాను అమ్మ ఎక్కడుంది అని చెప్పగా బెడ్రూంలో ఉందని తన కూతురు చెప్పింది. అయితే బెడ్ రూమ్ తలుపులు కొట్టగా ప్రియా తన బావతో అడ్డంగా దొరికిపోయింది.

 

తన భర్తకు నిజం తెలుసుకోవడంతో తను తన భార్యపై చేయి చేసుకున్నారు. అయితే ప్రియా తన తల్లికి సోదరుడికి లేనిపోనివి చెప్పి వారిని న్యూజిలాండ్ రప్పించి బైచిరాజుపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తనని జైలు పాలు చేసింది. తాను జైలుకు వెళ్లి తిరిగి వచ్చేలోపు తన బావతో కలిసి కేరళ వచ్చేసింది. ఎలాగైనా ఆస్తి తన కూతురు పేరు మీద ఉన్నదంత తన పేరుపై రాపించుకోవాలని ప్రియా ప్లాన్ చేసింది. అయితే కూతురి కోసం బైచిరాజు ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు.

తన కూతురు తనతో పంపించాలని తనకు డబ్బు ఆస్తులు ఏమీ వద్దని తన కూతురు ఒక్కటే ఉంటే చాలు అని చెప్పిన ప్రియ కనుకరించలేదు చివరికి తన బావతో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు నా కూతురిని నాకు ఇవ్వు అని చెప్పిన హామీ కనకరించలేదు.కనీసం నా కూతురితో ఒక్కసారి మాట్లాడుతానని చెప్పినా ప్రియా కనకరించలేదు ఇలా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసారు. కూతురితో ఒక ముద్దు కోసం దాదాపు 8 రోజులపాటు ఆ ఇంటి చుట్టూ తిరిగిన తన కూతురిని కనీసం చూపించలేదు దీంతో విసుకు చెందిన ఆయన నా కూతురు లేని జీవితం నాకెందుకు అని ప్రియ చేసిన మోసాలు అన్నింటిని ఒక వీడియో రూపంలో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

ఇది చూసినటువంటి ఎంతోమంది వెంటనే పోలీసులను అప్రమత్తం చేసే బైచిరాజు ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన ఉరి వేసుకొని చనిపోయారు. ఇక తన తండ్రి అంత్యక్రియలు ముందు ఎంతోమంది నేటిజన్స్ తన కూతురి ముద్దు కోసం తహతహలాడి ప్రాణాలు కోల్పోయిన ఈ తండ్రికి కనీసం చివరికి తన కూతురితో ఒక ముద్దు ఇప్పించి తన ఆత్మ శాంతించేలా చేయమని పోలీసులతో చెప్పించిన ఆ తల్లి మనసు కరగలేదు ఇలా కూతురితో ముద్దు తీసుకోకుండా కూతురికి ప్రేమగా ఒక ముద్దు పెట్టకుండానే ఈయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలాంటి భార్య పగవాడికి కూడా రాకూడదు అంటూ ఎంతో మంది నెటిజన్స్ ఆమె వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -