Ghaziabad: ఈ యువతి చేసిన పని తెలిస్తే మాత్రం దండం పెట్టాల్సిందే!

Ghaziabad: ఇప్పట్లో చదివిన చదువులకు సరైన ఉద్యోగం లేక చాలామంది నానా అవస్థలు పడుతున్నారు. చాలామంది వాళ్ళు ఇచ్చే జీతం చాలక ఉద్యోగాలు మానేసి సొంతంగా బిజినెస్ లు పెట్టి లక్షలు, కోట్లు సంపాదిస్తారు. అలాంటి వారిలో ఈమె కూడా ఒకరు. ఆమె 10 లక్షల మందికి దారి చూపించిన దేవత, ఇవాళ ఈమె దయ వల్ల విదేశాల్లో మంచి ప్యాకేజీతో జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. రూ. లక్షతో కంపెనీ పెట్టి మూడేళ్ళలో దాన్ని రూ. 50 కోట్ల విలువైన సంస్థగా మార్చారంటే ఆమె ఎంత టాలెంటెడో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు ఆరుషి అగర్వాల్. వయసు 27. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా.

ప్రస్తుతం ఈమె ఘజియాబాద్ జిల్లాలోని నెహ్రూ నగర్ లో నివసిస్తున్నారు. అయితే ఈమె చిన్న వయసులోనే కంపెనీ పెట్టి మూడేళ్లలో 50 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగిన మహిళా వ్యవస్థాపకురాలిగా పేరు సంపాదించుకున్నారు. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఈమె ఐఐటీ ఢిల్లీలో ఇంటర్న్షిప్ చేశారు. రెండు సార్లు కోటి రూపాయల ప్యాకేజీతో ఆఫర్ వచ్చినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరించారు. సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్న ఆమె లక్ష రూపాయలతో కంపెనీ ప్రారంభించారు. క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవ్వని వారికి సహాయం చేసేలా ఒక సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేశారు. దీని కోసం ఆమె కోడింగ్ నేర్చుకున్నారు. అలా 2020లో కరోనా సమయంలో టాలెంట్ డీక్రిప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఈమె పెట్టుబడిగా రూ. లక్ష పెట్టారు.

 

గత మూడేళ్ళలో ఈమె సాఫ్ట్ వేర్ వేదిక ద్వారా 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. కాగా వారంతా కూడా అమెరికా, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫార్మ్ లో హ్యకథాన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వర్చువల్ స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేయవచ్చు. ఈ టెస్ట్ లో పాసైతే నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవ్వచ్చు. చాలా యూనివర్సిటీలు ఈ సాఫ్ట్ వేర్ సేవలను పొందుతున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్. మోసం చేసే అవకాశం అస్సలు ఉండదు. స్కిల్ టెస్ట్ సమయంలో ఇతర డివైజ్ లు ఉపయోగించి లేదా ఇతరుల సహాయం తీసుకుని పాసయ్యే అవకాశం ఉండదు. జెన్యూన్ గానే ఉంటుంది. ఈమె ఐఐఎం బెంగళూరు నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పూర్తి చేశారు. దేశంలోనే టాప్ వ్యవస్థాపకులలో ఒకరిగా భారత ప్రభుత్వం చేత అవార్డు కూడా పొందారు. నోయిడాలో ఉన్న ఈమె కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈమె తన తాతయ్య ఓం ప్రకాష్ గుప్తాను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈమె తండ్రి అజయ్ గుప్తా ఒక వ్యాపారవేత్త ఈమె తల్లి గృహిణి. తెలివితేటలు ఉంటే ఆ ఒక్క లక్షతోనే రూ. 50 కోట్లు, రూ. 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చునని ఈమె నిరూపించింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -