Laptop: పండగలు, ప్రత్యేక రోజుల్లో కొన్ని కంపెనీలు తమ వస్తువులను విక్రయించడానికి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో వాటిని కొనేందుకు జనాలు బారులుదీరుతారు. అయితే ల్యాప్టాప్ కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్లో ల్యాప్టాప్ పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే లాప్టాప్లను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో ల్యాప్టాప్ను కేవలం రూ. 2వేలకే కొనుగోలు చేయొచ్చు. ఈ ధరకు స్మార్ట్ ఫోన్ కూడా రాదు. ఇంత తక్కువ ధరకు లాప్ట్యాప్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్కార్ట్ లో ల్యాప్టాప్ పైన సూపర్ డీల్ లభిస్తోంది. అంతేకాక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో భాగంగా భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఆసస్ క్రోమ్ బుక్ సెలెరియో డ్యూయల్ కోర్ ల్యాప్టాప్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆసస్ క్రోమ్ బుక్ సెలెరియో కోరన్ ల్యాప్టాప్ ను ఫ్లిప్కార్ట్లో లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ లాప్టాప్ ధర 22,990 గా ఉంది. అయితే దీనిపై 17శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇప్పుడు ఈ ల్యాప్టాప్ను రూ.18,990 అందుబాటులో ఉంది. అయితే దీన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ లో కొంటే మాత్రం భారీ తగ్గింపు ఉంది. ఏకంగా 17 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ లాప్టాప్ను కేవలం రూ. 1,990కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ల్యాప్టాప్ కండిషన్ మోడల్ బట్టి ఉంటుంది. అందువల్ల ఎక్సైంజ్ విలువ తక్కువ కూడా ఉండవచ్చు. అప్పుడు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆసస్ క్రోమ్ బుక్ లాప్టాప్ లో 11.6 ఇందుల స్కీన్ 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్రోమ్ ఓఎస్ ఇంటెల్ సెలెరియో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, యూఎస్బీ టైప్ సి పోర్ట్ మైక్రో ఎస్టీ కార్డ్ రీడర్ వైఫై 5, బ్లూటూత్ 4.0 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.