Lakshmi Devi: ఇంట్లో లక్ష్మీ తిష్ట వేయాలంటే ఆదాయంతో ఆ పని చేయాల్సిందే?

Lakshmi Devi: సాధారణంగా చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. అవసరమైన ఖర్చులు ఏర్పడి సంపాదించిన డబ్బులు అంతా పోవడం మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఎంత పొదుపు చేయాలని చూసినా కూడా ఏదో ఒక సమస్య వచ్చి పడి అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా డబ్బును ఎలా వినియోగించాలి అన్న విషయాన్ని తెలివిగా ఆలోచించాలి.

 

దాంతో పాటుగా వాస్తు ప్రకారంగా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి. డబ్బులు చేతిలో మిగలడం లేదు అని బాధపడేవారు కొన్ని పరిహారాలు పాటించాలి. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వృత్తిలో పురోగతి, గౌరవం, విజయం ఇచ్చే గ్రహం సూర్య గ్రహం. కాబట్టి ప్రతి రోజు ఉదయం స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యన్ని తప్పక సమర్పించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కెరియర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కనకధారా స్త్రోత్రం, లక్ష్మి స్తోత్రం పాటించాలి. అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి.

అలాగే లక్ష్మి దేవి కృప మీపై పడి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా తులసి చెట్టును లక్ష్మి దేవిగా భావిస్తాం. కాబట్టి లక్ష్మి దేవి మన ఇంట్లో నిలవాలంటే నిత్యం తులసి చెట్టుకు పూజ చేయాలి. ప్రతి రోజు తులసి చెట్టుకు నీరు పోసి దీపారాధన చేయాలి. అలాగే శివుడి అనుగ్రహం కూడా మనకు చాలా అవసరం. జీవితంలో అపారమైన ఆనందం శ్రేయస్సు పొందాలంటే శివలింగాన్ని ప్రతి రోజు అభిషేకం చేయాలి. పాలు కలిపినా నీటి అభిషేకం చేయాలి. వీటిని పాటించడం వల్ల లక్ష్మీదేవి అదృష్టంలా పట్టిపీడిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -