Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు రావడానికి బాబు కారణమా?

Sr NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో చూసాం. ఇక రాజకీయపరంగా కూడా ప్రజల మనిషిగా నిలిచారు. సొంతంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంతో మంచి అభిమానం సంపాదించుకున్నారు. రాజకీయపరంగా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వాళ్లలో నారా చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అయితే ఈరోజు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా ఈ సందర్భంగా పలు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని చాలా విషయాలు పంచుకున్నారు. ఆ కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి కూడా పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు.

 

లక్ష్మీపార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నించాడని.. కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు అని అన్నాడు. ఇక ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో అని.. కృష్ణుడని.. వెన్నుపోటు పొడిపించుకున్న వాడని తెలుసు.. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు.. నేను చెప్పాల్సిందేమీ లేదు అని అన్నాడు. ఇక ఎన్టీఆర్ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతాను అంటూ.. ఎన్టీఆర్ తన జీవితంలోకి లక్ష్మీపార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు.

 

ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఒక లెక్చరర్. ఆమెకు సంస్కృతం బాగా వచ్చు. ఆమె ఒక గొప్ప మేధావి. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కనే ఉంటూ తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఆమెను బయటకి పంపించాలి అని కుట్ర చేశాడు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి స్నేహితురాలు కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని తప్పుడు వ్యాఖ్యలు పుట్టించాడు.

 

ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంటికి పిలిపించుకొని.. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. నీకు లక్ష్మీపార్వతి కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడిగాడని తెలిపాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ.. లక్ష్మీపార్వతీ నాకు తల్లి లాంటిది సార్. నేను ఎప్పుడు తప్పు చేయలేదు అని అన్నాడని తెలిపాడు.

 

ఇక అప్పుడే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి.. నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అని.. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులని ఆమెకు ఇస్తారని భయం అని అన్నాడు. కానీ లక్ష్మీపార్వతి ఎప్పుడు ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర మాట్లాడలేదని.. ఒక గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటానని సంతోషపడింది అని అన్నాడు. ఇక చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు వచ్చిందని.. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతను చూసుకుని లక్ష్మీపార్వతి అని.. కానీ ఎవరు మాత్రం పట్టించుకోలేదు అని ఆమె గురించి మరిన్ని విషయాలు చెబుతూ చంద్రబాబుని విమర్శించాడు. ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా...
- Advertisement -
- Advertisement -