Tarak: ఆ విషయంలో రిస్క్ చేయడం తారక్ కు అవసరమా?

Tarak: టాలీవుడ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 సినిమాల‌తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్‌ అవతారం ఎత్తాడు. ఈ రెండు సినిమాల దెబ్బ‌తో ప్ర‌శాంత్ నీల్‌కు ఫుల్ డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. దేశ‌వ్యాప్తంగా స్టార్ హీరోలంతా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటున్నారు. ఆయన సినిమాలో నటిస్తే పాన్ ఇండియా క్రేజ్ కచ్చితంగా వచ్చేస్తుందని ఆశ పడుతున్నారు.

 

కేజీయ‌ఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో స‌లార్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతోంది. 2023లోనే సలార్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా కనిపించనుంది. స‌లార్ సినిమా త‌ర్వాత కూడా ప్రశాంత్ నీల్ మరో తెలుగు హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.

 

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆ వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. దీనిపై ఇప్ప‌టికే అధికారిక ప్రక‌ట‌న కూడా రావడంతో ప్రశాంత్ నీల్ ఓ వైపు ప్ర‌భాస్ స‌లార్ సినిమా తెర‌కెక్కిస్తూనే ఇటు ఎన్టీఆర్ సినిమా క‌థ‌పై క‌స‌ర‌త్తులు మొదలు పెట్టారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామా సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

 

ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ అప్ డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ తో తీసే సినిమా మ‌ల్టీస్టార‌ర్ సినిమా అనే షాకింగ్ విషయం తెలిసింది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోకు సెట్ అయ్యే ఓ క్యారెక్ట‌ర్ ఉంద‌ని, ఆ పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌తో చేయించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో ఇప్పడు అమీర్ లాంటి న‌టుడు కూడా తోడైతే ఈ కాంబినేషన్ సెన్సేషన్ అవుతుంది. ఏదేమైనా ఆ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మారిపోతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -