Sharmila: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలవడం సాధ్యమేనా?

Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో షర్మిల ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలలో హైలెట్ అవుతోంది. ఇది ఇలా ఉంటే షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూ పై కలిసి పోరాటం చేద్దామని ప్రతిపాదన పెట్టారు. అయితే నిజానికి షర్మిల ఇలా ఇద్దరికి ఫోన్ చేస్తున్నట్లుగా తెలియదేమో కానీ ఇద్దరూ స్పందించారు. కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కానీ పార్టీలో చర్చించుకొని చెబుతాము అని తెలిపారు సంజయ్, రేవంత్.

బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోరాటం చేసే చాన్స్ లేదు. షర్మిల కావాలనుకుంటే ఆ పార్టీతో కలిసి ఆ పార్టీతో పోరాటం చేయవచ్చు. కానీ ఆమె ఇలా ఇద్దరికీ ఫోన్లు చేశానని షర్మిల ప్రకటించుకోవడంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతులు కూడా షాక్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి పోరాటం చేయడం ఎలా సాధ్యమని అంటూ షర్మిల మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. కాగా గతంలో షర్మిల పై దాడి జరిగినప్పుడు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రధాని కూడా పరామర్శించారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.

 

అయితే ఆ తర్వాత మళ్లీ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నట్లుగా ప్రచారం అయితే జరగడం లేదు. షర్మిల పాదయాత్ర హఠాత్తుగా పోలీసులు నిలిపివేసిన తర్వాత చేయడానికి ఏమీ కనిపించడం లేదు. ఎప్పుడో ఒక్కసారి ట్యాంక్ బండ్‌ పై ధర్నా చేయడం, లాంటి కార్యకలాపాలు తప్ప ఏమీ లేవు. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టలేదు. పాలేరులో తాను పోటీ చేాయలనుకుంటున్నందున అక్కడ మాత్రం కొంత ఖర్చుపెట్టి ప్రజలకు నగదు పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -