Karthika Deepam: ఆ ఫోటోతో అందరికీ క్లారిటీ.. అర్చన ఎఫైర్ నిజమేనా?

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారమయ్యే ‘కార్తీకదీపం’ సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ వస్తుందంటే.. చాలా మంది ఆడవాళ్లు తమ పనులు త్వరగా పూర్తి చేసుకోవడం లేదా.. పనుల పక్కనపెట్టి సీరియల్స్ చూస్తుంటారు. బుల్లితెరపై ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లోనే కార్తీకదీపం సీరియల్ ది బెస్ట్ గా నిలిచింది. ఈ సీరియల్‌లో నటించే చాలా మంది నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్లకు ఉండేంత క్రేజ్ ఉంటుంది. టాప్ రేటింగ్‌లో దూసుకెళ్తున్న ఈ సీరియల్ గురించి ప్రతీరోజూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది.

 

ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను టీవీ ముందే కట్టి పడేస్తుంటారు. తాజాగా ఈ సీరియల్‌లో కార్తీక్ తల్లీగా నటించిన ‘అర్చన’ గురించి తెలిసి ఉండే ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఓ వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. అర్చన తన భర్తను వదిలేసి ఓ ముసలోడితో ఎఫైర్ పెట్టుకున్నట్లు సమాచారం. దీనిపై గతంలో చాలా పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై అర్చన ఇప్పటికీ స్పందించలేదు.

 

అయితే ఇటీవల ఈ సీరియల్‌లో నటించిన అమర్ దీప్, తేజస్వీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలందరూ వచ్చారు. ఈ పెళ్లికి అర్చన తన కొడుకుతోపాటు ఓ ముసలాయనతో కలిసి వచ్చింది. దీంతో అప్పటివరకు పుకారుగా ఉన్న వార్తలో ఒక్కసారిగా బలం వచ్చినట్లు అయింది. వీరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్చన డబ్బుల కోసమే ముసలోడితో ఎఫైర్ పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

 

 

ఈ క్రమంలో ఫోటోలో ఉన్న ముసలాయన ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగానే అర్చనకు ముసలాయనకు ఎఫైర్ నడుస్తోందా? లేదా ఆ ముసలాయన వేరే వ్యక్తా? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై అర్చన స్పందించాల్సి ఉంది. అర్చన క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -