Mohan Babu: మోహన్ బాబుకు డబ్బులెక్కువయ్యాయా.. అందుకే అలాంటి సినిమా తీస్తున్నారా?

Mohan Babu: సీనియర్ నటుడు మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీకి చెందిన వారు ఏ విషయం మాట్లాడిన కూడా సెన్సేషనల్ అవుతుందన్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా మోహన్ బాబు సైతం సినిమాల గురించి చేసిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ TTD ఈఓ ధర్మారెడ్డిని ఆరు నెలల తరువాత కలిసాను అని, అతనికి జరిగిన నష్టం చాలా ఘోరం అయినదని, ఆ నష్టం పూడ్చలేనిది చెప్పారు మోహన్ బాబు. ధర్మారెడ్డి కుమారుడు గత కొద్ది నెలల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే.

 

ఇకపోతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్ పట్ల అధికారపక్ష నేతలు విమర్శించిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై మోహన్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ మీడియాను ప్రశ్నించగా ఈ విషయం గురించి తాను తర్వాత మాట్లాడతానని మోహన్ బాబు తెలిపారు.

 

ఇక సినిమాల గురించి మోహన్ బాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను త్వరలోనే 100 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా చేయబోతున్నానని తెలిపారు. ఈ సినిమా గురించి విష్ణు అన్ని విషయాలు తెలియ చేస్తాడని తెలిపారు. ఇలా మోహన్ బాబు ఏకంగా 100 కోట్ల బడ్జెట్ సినిమాను ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు వ్యాఖ్యల పై స్పందించిన పలువురు మోహన్ బాబుకు డబ్బులు ఎక్కువ అయ్యి సినిమాలను ప్రకటిస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -