NTR: ఇండియాలో ఏ హీరో చేయని పని ఎన్టీఆర్ చేస్తున్నాడా?

NTR: జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా కథలో ఎన్టీఆర్ పలు మార్పులను సూచించినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని టాక్ నడుస్తోంది.

 

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ షెడ్యూల్‌ను సముద్రం సెట్‌లో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇండియాలోనే ఏ హీరో చేయని విధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సాహసాలు చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించే మూవీకి ఎన్టీఆర్ 30 అని వర్కింగ్ టైటిల్ నడుస్తోంది.

 

ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే అప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2024లో ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి సినిమా లేనట్లేనా?
కొరటాల శివతో ఎన్టీఆర్ తీస్తున్న మూవీని 2024లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో 2023లో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సినిమా వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సినిమా ఇండియన్ భాషల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తుండటంతో విడుదలలో జాప్యం జరిగిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. కాగా ఎన్టీఆర్ చిత్రానికి కొరటాల ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ టైటిల్ క‌థకు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -