Samantha: సామ్ నిజస్వరూపం బయటపెట్టిన డైరెక్టర్.. ఏమైందంటే?

Samantha: ఇటీవల సమంత ఓ అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత.. మొన్నటివరకు అమెరికాలో ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంది. అయితే మయోసైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. దీని వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ వ్యాధి బారిన పడిన రోగి కొద్దిసేపు కూడా నిలబడలేకపోతాడు. ఈ వ్యాధి బారిన పడిన వారి పరిస్థితి విషమిస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. పలువురూ భరోసా కల్పించారు. సమంత త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు దేవుడిని ప్రార్థించారు. అయితే ఇదే క్రమంలో సమంత హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘యశోద’. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. మొదట్లో సినిమా ప్రయోషన్లలో సమంత పాల్గొననప్పటికీ.. ఆ తర్వాత యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. సినిమా ప్రయోషన్లలో సమంత పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు కూడా ఆమెపై మండిపడుతున్నారు. తాజాగా డైరెక్టర్ గీతా కృష్ణ నటి సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

 

సమంత కావాలనే డ్రామాలు ఆడుతోందని డైరెక్టర్ గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా గీతా కృష్ణ మాట్లాడుతూ.. ‘సమంతతో నాకు మొదటి నుంచి పరిచయం ఉంది. మోడలింగ్‌ స్టార్ట్ చేసినప్పటి నుంచి సమంత నాకు తెలుసు. అయితే కడలి సినిమా గురించి ఐడియా ఉండే ఉంటుంది. వాస్తవానికి ఈ సినిమాలో సమంత నటించాల్సి ఉంది. కానీ సముద్రంలో దిగాలని, తనకు స్కిన్ డిసీజ్ ఉందని ఆ సినిమాకు నో చెప్పింది. అప్పటికే సమంతకు ఆ వ్యాధి ఉంది. కానీ ఇప్పుడు కావాలనే షో చేస్తోంది. సమంతకు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఇప్పుడు ఆమె యశోద సినిమా ప్రయోషనల్‌లో పాల్గొనలేదు. ఆమెను చూసుకోవడానికి డాక్టర్లు, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ సింపతీ కోసం ప్రయత్నిస్తోంది. కావాలనే డ్రామాలు ఆడుతోంది.’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -