Prabhas: ఆ క్వాలిటీ వల్ల ప్రభాస్ కెరీర్ కు నష్టం కలుగుతోందా?

Prabhas: టాలీవుడ్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు తెరకు ప్రభాస్ ఈశ్వర్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలు చేసుకుంటూ హిట్లు, ఫ్లాపులు అనే తేడా లేకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా చూస్తే ఛత్రపతి సినిమా ద్వారా ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ డైలాగ్ ను ఇప్పటికీ జనాలు వాడేస్తుంటారు.

 

ఇకపోతే పాన్ ఇండియా సినిమా అయిన బాహుబలి ద్వారా ఆయన మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రభాస్ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రభాస్ అంటే పడి చచ్చేవారు చాలా మందే ఉన్నారు. అయితే పైకి మంచోడిలా కనిపిస్తున్న ప్రభాస్ లో ఓ బ్యాడ్ క్వాలిటీ కూడా ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో బ్యాడ్ క్వాలిటీ అనే ఉంటుంది. స్టార్ హీరో ప్రభాస్ లో కూడా ఆ క్వాలిటీ ఉందని నెట్టింట వినిపిస్తోంది.

 

పైకి చాలా కూల్ గా హ్యాండ్సమ్ గా కనిపించే ప్రభాస్ కోపం వస్తే మాత్రం క్రూరంగా ఊగిపోతాడు. పక్కన ఎవరుండే విషయాన్ని కూడా ప్రభాస్ పట్టించుకోకుండా ఆయన ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును కోపంలో పగలగొట్టినా పగలగొట్టేస్తాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఎవరినైనా పాయింట్ అవుట్ చేసినా ఊరుకోడు. కెరియర్ స్టార్టింగ్ లో ఈ కోపం ప్రభాస్ కు ఎక్కువగా ఉండేదని ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ కూడా చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి.

 

అయితే కాలక్రమేనా ప్రభాస్ కోపం తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇప్పటికీ కొన్నిసార్లు ప్రభాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడని సన్నిహితులు చెబుతున్నారు. ఒక వేళ తనకు కోపం వస్తే కనుక ప్రభాస్ ను ఎవ్వరూ ఆపలేరని బంధువులు కూడా చెబుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ లో ఆ క్వాలీటీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -