Mahesh Babu: మహేష్ బాబు క్రేజ్ ను చూసి ఆ స్టార్ హీరో భయపడ్డారా?

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడిగా మహేష్‌బాబు సినిమా రంగ ప్రవేశం చేసి నటశేఖర వారసుడి హోదాను పొందారు. మరో సూపర్‌ స్టార్‌గా ఎదుగుతున్నారు మహేష్‌ బాబు. అయితే, కృష్ణ నుంచి వారసత్వం పుణికిపుచ్చుకున్న మహేష్‌బాబు.. సూపర్‌స్టార్‌ పేరును నిలబెట్టేలా కృషి చేస్తున్నారడంలో సందేహం లేదు. ఈ క్రమంలో అనేక ఆటోపోట్లు, హిట్లు, ఫట్లు అందుకున్నాడు మహేష్‌బాబు. తన జర్నీలు అన్నీ ఉన్నాయంటున్న మహేష్‌బాబు.. తాజాగా తన కుటుంబంలో వరుస విషాదాలతో గుండె బరువెక్కింది.

 

తన తల్లి, సోదరుడు, తండ్రిని వరుసగా పోగొట్టుకున్న మహేష్‌బాబు.. ప్రస్తుతం కాస్త తేరుకొని మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. మహేష్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్నాడు. షూటింగ్‌ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. త్రివిక్రమ్‌, మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఇప్పటికే అతడు, ఖలేజా లాంటి మంచి సినిమాలు వచ్చాయి. మరోసారి మహేష్‌బాబుతో బంపర్‌ హిట్‌ కొట్టాలని త్రివిక్రమ్‌ పట్టుదలతో ఉన్నారు.

 

త్రివిక్రమ్‌తో మూవీ తర్వాత మహేష్‌బాబు.. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ భారీ కథను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని, త్వరలోనే కంప్లీట్‌ అవుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం రాజమౌళి, మహేష్‌బాబు అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఉండగా మహేష్‌బాబు తనకు పోటీగా వస్తున్నాడని ఇండస్ట్రీలో ఓ హీరో కుళ్లుకున్నాడట.

 

తొక్కేయాలని ప్రయత్నించారా?
మహేష్‌బాబు కెరీర్‌ పుంజుకుంటున్న తరుణంలో ఓ స్టార్‌ హీరో అడ్డు పడ్డాడనే వార్తలు వచ్చాయి. అప్పట్లో తనకు మహేష్‌బాబు పోటీగా వస్తున్నాడని భావించిన ఓ బడా హీరో.. మహేష్‌ను తొక్కేయాలని ప్రయత్నించాడట. ఈ క్రమంలోనే మహేష్‌బాబు నటించిన సైనికుడు, బ్రహ్మోత్సవం సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అదే సమయంలో ఈ స్టార్‌ హీరో.. మహేష్‌బాబు రెండు సినిమాలపై విపరీతమైన బ్యాడ్‌ పబ్లిసిటీ చేయించాడట. సినిమాలపై నెగిటివ్‌ పబ్లిసిటీతో అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో పాటు కథలోనూ లోపాలున్నాయి. అయితే, మహేష్‌బాబును తొక్కేయడానికి ఆ స్టార్‌ హీరో ట్రై చేశారని భోగట్టా.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -